ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన

ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టులకు టీమ్​ఇండియా బృందాన్ని ప్రకటించారు. కోహ్లీ, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ జట్టులోకి పునరాగమనం చేశారు.

author img

By

Published : Jan 19, 2021, 6:39 PM IST

India announce squad for first two Tests against England
ఇంగ్లాండ్​తో టెస్టులకు భారత జట్టు ప్రకటన

ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్​ల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. పితృత్వ సెలవుల కారణంగా ఆసీస్​తో చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ.. తిరిగి జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్య, ఇషాంత్​ శర్మ కూడా పునరాగమనం చేశారు.

ఆసీస్​ పర్యటనలో ఉన్నవారే దాదాపుగా ఈ సిరీస్​ ఆడనున్నారు. అయితే చివరి టెస్టు మాత్రమే ఆడిన నటరాజన్​కు ఇందులో అవకాశం లభించలేదు. భువనేశ్వర్​ కుమార్​ కూడా ప్రకటించిన జట్టులో లేకపోవడం అభిమానుల్ని నిరాశపరిచింది.

జట్టు

రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, సాహా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, శార్దుల్ ఠాకుర్, అశ్విన్, కుల్​దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్​ల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. పితృత్వ సెలవుల కారణంగా ఆసీస్​తో చివరి మూడు టెస్టులకు దూరమైన కోహ్లీ.. తిరిగి జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్య, ఇషాంత్​ శర్మ కూడా పునరాగమనం చేశారు.

ఆసీస్​ పర్యటనలో ఉన్నవారే దాదాపుగా ఈ సిరీస్​ ఆడనున్నారు. అయితే చివరి టెస్టు మాత్రమే ఆడిన నటరాజన్​కు ఇందులో అవకాశం లభించలేదు. భువనేశ్వర్​ కుమార్​ కూడా ప్రకటించిన జట్టులో లేకపోవడం అభిమానుల్ని నిరాశపరిచింది.

జట్టు

రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, సాహా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, శార్దుల్ ఠాకుర్, అశ్విన్, కుల్​దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.