ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ఇండియా. ఉత్కంఠ పోరులో గెలిచి సిరీస్ను 2-2 తేడాతో సమం చేసింది. చివరి టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్లోనే అర్ధశతకం చేసిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ 9 వేల పరుగులు, హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్తో పాటు ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.
- 2020 నుంచి చూసుకుంటే టీమ్ఇండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు శార్దూల్ ఠాకూర్. ఇతడు 20 వికెట్లు దక్కించుకోగా చాహల్, సుందర్ చెరో 10 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బుమ్రా 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
- ఇంగ్లాండ్ జట్టుపై టీ20ల్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి తక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ఇతడు 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంతకుముందు బుమ్రా 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
- బ్యాటింగ్ చేసిన తొలి టీ20 మ్యాచ్లోనే అర్ధశతకం చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్. ఇతడి కంటే ముందు ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప (2007), రోహిత్ శర్మ (2007), అజింక్యా రహానే (2011), ఇషాన్ కిషన్ (2021) ఉన్నారు.
- విరాట్ కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అదిల్ రషీద్. ఇతడు కోహ్లీని 8 సార్లు పెవిలియన్ చేర్చాడు. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అండర్సన్, గ్రేమ్ స్వాన్ కూడా 8సార్లు విరాట్ను ఔట్ చేశారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ 10 సార్లు కోహ్లీని ఔట్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్
- టీ20ల్లో భారత గడ్డపై ఎక్కువ సిక్సులు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇతడు స్వదేశంలో 50 సిక్సులు సాధించాడు. కోహ్లీ (48), యువరాజ్ సింగ్ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- టీ20ల్లో 9 వేల పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 9001 పరుగులు ఉన్నాయి. గతేడాది ఈ ఘనతను చేరుకున్నాడు విరాట్ కోహ్లీ.రోహిత్
- ఎక్కువ మ్యాచ్ల్లో కనీసం ఒక్క సిక్స్ బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు రోహిత్ శర్మ. ఇతడితో పాటు కోహ్లీ 95 మ్యాచ్ల్లో కనీసం ఒక సిక్సయినా బాదారు. ధోనీ (105) అగ్రస్థానంలో ఉండగా, రైనా (98) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.
- ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ స్టంపౌట్గా వెనుదిరిగాడు. టీ20ల్లో ఇలా ఔట్ అవ్వడం కోహ్లీకి ఇదే మొదటిసారి.
- టీ20ల్లో ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.