ఇంగ్లాండ్తో జరిగే తొలి టీ20 మ్యాచ్కు సంబంధించిన టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే 40 వేలకు పైగా టికెట్లు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇటీవలే జరిగిన రెండు టెస్టులకు పెద్దగా ప్రేక్షకులు హాజరుకాలేదు. కానీ శుక్రవారం (మార్చి 12) నుంచి ప్రారంభమయ్యే పొట్టి ఫార్మాట్కు వీక్షకుల సంఖ్య భారీగా ఉండే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆన్లైన్తో పాటు స్టేడియం వద్ద ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. టీ20 సిరీస్లోని ఐదు మ్యాచ్లూ.. ఇదే వేదికగా మార్చి 14, 16, 18, 20 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్లోని ప్రతి టీ20 మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇదీ చూడండి: 'కొత్త వారం, కొత్త ఫార్మాట్.. లక్ష్యం మాత్రం అదే'