ETV Bharat / sports

'రెండో టెస్టులో 300 చేసినా చెపాక్​లో 500తో సమానం'

author img

By

Published : Feb 13, 2021, 4:15 PM IST

Updated : Feb 13, 2021, 4:27 PM IST

చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ వికెట్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​. పిచ్​ స్పిన్నర్లకు స్వర్గధామమని, ఇక్కడ చివరి రోజుల్లో బ్యాటింగ్​ చేయడం అంత సులువు కాదన్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 300 చేసినా.. చెపాక్​ పిచ్​లో 500తో సమానమని ట్వీట్​ చేశాడు.

Ind vs Eng, 2nd Test
'చెపాక్​ పిచ్​పై తొలి ఇన్నింగ్స్​ స్కోరు 300 అయినా గొప్పే!'

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ పిచ్​పై ఆతిథ్య జట్టు మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెపాక్​లో మ్యాచ్​ సాగేకొద్దీ పిచ్​ మందకొడిగా తయారవుతుందని చెప్పాడు. మూడు, నాలుగో ఇన్నింగ్స్​లలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ఈ పిచ్​పై తొలి ఇన్నింగ్స్​లో 300 స్కోరు సాధించినా.. చెపాక్​ పిచ్​పై 500 పరుగులకు సమానమని ట్వీట్​ చేశాడు వాన్​.

Vaughan tweet
వాన్​ ట్వీట్​

భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​లో తొలి టెస్ట్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించలేదు. అయితే.. అదే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్​ వికెట్​ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు చక్కని సహకారం లభిస్తోంది.

రోహిత్​ శర్మ భారీ శతకంతో రాణించాడు. 161 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహనె తన టెస్ట్​ కెరీర్​లో 23వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్​ఇండియా స్కోరు 250 దాటింది.

ఇదీ చదవండి: చెన్నై టెస్టు: రోహిత్​ శతకం- అరుదైన రికార్డు

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ పిచ్​పై ఆతిథ్య జట్టు మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెపాక్​లో మ్యాచ్​ సాగేకొద్దీ పిచ్​ మందకొడిగా తయారవుతుందని చెప్పాడు. మూడు, నాలుగో ఇన్నింగ్స్​లలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ఈ పిచ్​పై తొలి ఇన్నింగ్స్​లో 300 స్కోరు సాధించినా.. చెపాక్​ పిచ్​పై 500 పరుగులకు సమానమని ట్వీట్​ చేశాడు వాన్​.

Vaughan tweet
వాన్​ ట్వీట్​

భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​లో తొలి టెస్ట్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించలేదు. అయితే.. అదే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్​ వికెట్​ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు చక్కని సహకారం లభిస్తోంది.

రోహిత్​ శర్మ భారీ శతకంతో రాణించాడు. 161 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహనె తన టెస్ట్​ కెరీర్​లో 23వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమ్​ఇండియా స్కోరు 250 దాటింది.

ఇదీ చదవండి: చెన్నై టెస్టు: రోహిత్​ శతకం- అరుదైన రికార్డు

Last Updated : Feb 13, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.