ETV Bharat / sports

మెరిసిన వేడ్, స్మిత్.. భారత్ లక్ష్యం 195

author img

By

Published : Dec 6, 2020, 3:19 PM IST

Updated : Dec 6, 2020, 3:31 PM IST

టీమ్​ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వేడ్ (58) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

IND vs AUS T20
మెరిసిన వేడ్.. భారత్ లక్ష్యం 195

టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్​గా వచ్చిన కెప్టెన్ వేడ్ 32 బంతుల్లో 58 పరుగులతో దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించాడు. తర్వాత ఇతడు నాటకీయ రీతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ షార్ట్ విఫలమైనా.. స్మిత్ 46 పరుగులతో రాణించాడు. తర్వాత మ్యాక్స్​వెల్ (22), హెన్రిక్స్ (26), స్టోయినిస్ (16) దూకుడుగా ఆడటం వల్ల ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

టీమ్ఇండియా బౌలర్లలో నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్​గా వచ్చిన కెప్టెన్ వేడ్ 32 బంతుల్లో 58 పరుగులతో దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించాడు. తర్వాత ఇతడు నాటకీయ రీతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ షార్ట్ విఫలమైనా.. స్మిత్ 46 పరుగులతో రాణించాడు. తర్వాత మ్యాక్స్​వెల్ (22), హెన్రిక్స్ (26), స్టోయినిస్ (16) దూకుడుగా ఆడటం వల్ల ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

టీమ్ఇండియా బౌలర్లలో నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Dec 6, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.