ETV Bharat / sports

టీమ్ఇండియా మరపురాని విజయం.. రికార్డులపై ఓ లుక్కేద్దాం!

author img

By

Published : Jan 19, 2021, 1:53 PM IST

Updated : Jan 19, 2021, 5:19 PM IST

బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ఫలితంగా సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే గబ్బాలో 32 ఏళ్ల ఆసీస్ విజయం పరంపరకు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

IND vs AUS
భారత్-ఆస్ట్రేలియా

బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. అలాగే వరుసగా మూడోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమెరుగని ఆసీస్​ను కంగుతినిపించింది. టెస్టు ఛాంపియన్ షిప్​లో నెంబర్​ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

గబ్బాలో అబ్బా అనిపించిన టీమ్ఇండియా

బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. 1988 నుంచి అక్కడ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు కంగారూ జట్టు. అక్కడ ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2021లో కంగారూ జట్టును కంగుతినిపించింది భారత్.

గబ్బాలో అత్యధిక ఛేదన భారత్​దే

గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉండేది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఈ రికార్డును తిరగరాసింది. గబ్బా మైదానంలో 328 పరగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.

టీమ్ఇండియా అత్యధిక ఛేదన

1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన

2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన

2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన*

2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన

2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..

2008/09 : పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన

1928/29 : మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 332 పరుగుల ఛేదన

2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 329 పరుగుల ఛేదన*

తొలి టెస్టు ఓడాక భారత్‌ సిరీస్‌ గెలిచిన సందర్భాలు..

1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలుపు

2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు

2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం

2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం

2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు*

ఐదో రోజు అత్యధిక పరుగులు

1948 లీడ్స్‌ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్‌)

1984 లార్డ్స్‌ ‌: 344 (వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

2020/21 బ్రిస్బేన్ : 325(భారత్‌ vs ఆస్ట్రేలియా)*

1977/78 పెర్త్‌: 317(ఆస్ట్రేలియా vs భారత్‌)

2017 లీడ్స్‌: 317(వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు

1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్‌ 34 మ్యాచ్‌లు ఆడింది

1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్‌లు ఆడింది.

1948-1993 వరకు కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో వెస్టిండీస్‌ 27 మ్యాచ్‌లు ఆడింది

1905-1954 వరకు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ 25 మ్యాచ్‌లు ఆడింది

1958-1989 వరకు సెబీనా పార్క్‌లో వెస్టిండీస్‌ 19 మ్యాచ్‌లు ఆడింది

బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. అలాగే వరుసగా మూడోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమెరుగని ఆసీస్​ను కంగుతినిపించింది. టెస్టు ఛాంపియన్ షిప్​లో నెంబర్​ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

గబ్బాలో అబ్బా అనిపించిన టీమ్ఇండియా

బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. 1988 నుంచి అక్కడ ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు కంగారూ జట్టు. అక్కడ ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2021లో కంగారూ జట్టును కంగుతినిపించింది భారత్.

గబ్బాలో అత్యధిక ఛేదన భారత్​దే

గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉండేది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఈ రికార్డును తిరగరాసింది. గబ్బా మైదానంలో 328 పరగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.

టీమ్ఇండియా అత్యధిక ఛేదన

1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన

2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన

2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన*

2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన

2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..

2008/09 : పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన

1928/29 : మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 332 పరుగుల ఛేదన

2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 329 పరుగుల ఛేదన*

తొలి టెస్టు ఓడాక భారత్‌ సిరీస్‌ గెలిచిన సందర్భాలు..

1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలుపు

2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు

2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం

2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం

2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు*

ఐదో రోజు అత్యధిక పరుగులు

1948 లీడ్స్‌ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్‌)

1984 లార్డ్స్‌ ‌: 344 (వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

2020/21 బ్రిస్బేన్ : 325(భారత్‌ vs ఆస్ట్రేలియా)*

1977/78 పెర్త్‌: 317(ఆస్ట్రేలియా vs భారత్‌)

2017 లీడ్స్‌: 317(వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్)

ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు

1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్‌ 34 మ్యాచ్‌లు ఆడింది

1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్‌లు ఆడింది.

1948-1993 వరకు కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో వెస్టిండీస్‌ 27 మ్యాచ్‌లు ఆడింది

1905-1954 వరకు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ 25 మ్యాచ్‌లు ఆడింది

1958-1989 వరకు సెబీనా పార్క్‌లో వెస్టిండీస్‌ 19 మ్యాచ్‌లు ఆడింది

Last Updated : Jan 19, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.