ETV Bharat / sports

'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా పంత్​

author img

By

Published : Feb 8, 2021, 1:50 PM IST

Updated : Feb 8, 2021, 2:45 PM IST

'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డు భారత యువ క్రికెటర్​ రిషభ్​ పంత్​కు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.​ ఆస్ట్రేలియా సిరీస్​లో చేసిన అద్భుత ప్రదర్శనకు గానూ పంత్​ను ఈ అవార్డు వరించింది.

ICC Men's Player of the Month award
'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా పంత్​

ఐసీసీ ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డును.. భారత యువ వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియా సిరీస్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు పంత్​. ఆ సిరీస్​లో 97, 89 పరుగులు చేసి భారత విజయానికి దోహదం చేశాడు.

ఏ ఆటగాడైనా జట్టును గెలిపించడమే గొప్ప రివార్డుగా భావిస్తాడు. నాలాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇటువంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా సిరీస్​ విజయంలో సభ్యులైన ప్రతి ఇండియా క్రికెటర్​కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

-రిషభ్​పంత్, భారత వికెట్​కీపర్​

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లోనూ పంత్​ అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. కష్టాల్లో చిక్కుకున్న జట్టును 91 పరుగులు చేసి ఆదుకొనే ప్రయత్నం చేశాడు.

పంత్​ను అవార్డు వరించడంపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా స్పందించాడు. 'అతడు ఆడిన రెండు సందర్భాలు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవి. రెండింటిలోనూ అద్భుత నైపుణ్యం కనబరిచాడు. ఒక మ్యాచ్​లో గెలుపొందిన భారత్​, మరో టెస్టును డ్రా చేసుకుంది' అని తెలిపాడు.​

ఇదీ చదవండి: ఐసీసీ ప్రపంచ భాగస్వామిగా బైజూస్​

ఐసీసీ ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డును.. భారత యువ వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియా సిరీస్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు పంత్​. ఆ సిరీస్​లో 97, 89 పరుగులు చేసి భారత విజయానికి దోహదం చేశాడు.

ఏ ఆటగాడైనా జట్టును గెలిపించడమే గొప్ప రివార్డుగా భావిస్తాడు. నాలాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇటువంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా సిరీస్​ విజయంలో సభ్యులైన ప్రతి ఇండియా క్రికెటర్​కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

-రిషభ్​పంత్, భారత వికెట్​కీపర్​

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లోనూ పంత్​ అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. కష్టాల్లో చిక్కుకున్న జట్టును 91 పరుగులు చేసి ఆదుకొనే ప్రయత్నం చేశాడు.

పంత్​ను అవార్డు వరించడంపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా స్పందించాడు. 'అతడు ఆడిన రెండు సందర్భాలు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవి. రెండింటిలోనూ అద్భుత నైపుణ్యం కనబరిచాడు. ఒక మ్యాచ్​లో గెలుపొందిన భారత్​, మరో టెస్టును డ్రా చేసుకుంది' అని తెలిపాడు.​

ఇదీ చదవండి: ఐసీసీ ప్రపంచ భాగస్వామిగా బైజూస్​

Last Updated : Feb 8, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.