ETV Bharat / sports

మహిళా దినోత్సవం వేళ ఐసీసీ గుడ్ న్యూస్​

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళా క్రికెట్ విభాగంలో కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. రానున్న మహిళల మెగా ఈవెంట్లలో జట్ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది.

author img

By

Published : Mar 8, 2021, 2:08 PM IST

ICC events for women to have more teams from 2026
మహిళ దినోత్సవం సందర్భంగా ఐసీసీ గుడ్ న్యూస్​

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఐసీసీ శుభవార్త చెప్పింది. రానున్న కాలంలో ఐసీసీ మహిళ క్రికెట్ టోర్నీల్లో టీమ్​ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచ కప్​లో 10 టీమ్​లు పాల్గొంటున్నాయి. 2026 నుంచి ఈ సంఖ్యను 12కు పెంచనున్నారు. వన్డే వరల్డ్​ కప్​లో ప్రస్తుతం 8 జట్లు కొనసాగుతుండగా.. 2029 సీజన్​ నుంచి 10కి పెంచుతామని ఐసీసీ స్పష్టం చేసింది. 2024 టీ20 వరల్డ్​ కప్​తో పాటు రానున్న రెండు వన్డే ప్రపంచ కప్​లకు పాత పద్దతినే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

గత నాలుగేళ్లుగా మహిళా క్రికెట్​కూ ఆదరణ పెరుగుతోంది. మ్యాచ్​లు చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2020లో జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్​యే అందుకు ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రేక్షకులు ఈ టోర్నీ మ్యాచ్​లను వీక్షించారు. భారత్​, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్​ మ్యాచ్​కు.. అత్యధికంగా 86వేల పైచిలుకు అభిమానులు మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​కు వచ్చారు.

-మను సాహ్నీ, ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి.

ప్రపంచ క్రికెట్ వేదికపై మరిన్ని దేశాలు పాల్గొనాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, 2027లో జరిగే మహిళల టీ20 ఛాంపియన్స్​ కప్​కు మాత్రం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: భారత్​తో టీ20 సిరీస్​కు ఆర్చర్​ దూరం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఐసీసీ శుభవార్త చెప్పింది. రానున్న కాలంలో ఐసీసీ మహిళ క్రికెట్ టోర్నీల్లో టీమ్​ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచ కప్​లో 10 టీమ్​లు పాల్గొంటున్నాయి. 2026 నుంచి ఈ సంఖ్యను 12కు పెంచనున్నారు. వన్డే వరల్డ్​ కప్​లో ప్రస్తుతం 8 జట్లు కొనసాగుతుండగా.. 2029 సీజన్​ నుంచి 10కి పెంచుతామని ఐసీసీ స్పష్టం చేసింది. 2024 టీ20 వరల్డ్​ కప్​తో పాటు రానున్న రెండు వన్డే ప్రపంచ కప్​లకు పాత పద్దతినే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

గత నాలుగేళ్లుగా మహిళా క్రికెట్​కూ ఆదరణ పెరుగుతోంది. మ్యాచ్​లు చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2020లో జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్​యే అందుకు ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రేక్షకులు ఈ టోర్నీ మ్యాచ్​లను వీక్షించారు. భారత్​, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్​ మ్యాచ్​కు.. అత్యధికంగా 86వేల పైచిలుకు అభిమానులు మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​కు వచ్చారు.

-మను సాహ్నీ, ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి.

ప్రపంచ క్రికెట్ వేదికపై మరిన్ని దేశాలు పాల్గొనాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, 2027లో జరిగే మహిళల టీ20 ఛాంపియన్స్​ కప్​కు మాత్రం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: భారత్​తో టీ20 సిరీస్​కు ఆర్చర్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.