టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కన్న కలల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.
ఒకప్పుడు తాను టెన్నిస్ ప్లేయర్ కావాలని అనుకున్నట్లు తెలిపాడు. చిన్నప్పుడు తన తండ్రి కొనిచ్చిన టెన్నిస్ రాకెట్ను విరిచేసిన సంఘనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొత్తది కొనివ్వమని అడిగేందుకు చాలా భయపడినట్లు పేర్కొన్నాడు యువరాజ్.
"నాకు స్కేటింగ్, టెన్నిస్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో టెన్నిస్ను నా కెరీర్గా ఎంచుకోవాలనుకున్నా. మా నాన్న నాకు ఓ రాకెట్ కొనిచ్చాడు. ఆ సమయంలో దాని విలువ రూ.2,500. ఒకసారి క్వార్టర్ ఫైనల్స్లోనో, ఇంకేదో మ్యాచ్లో ఆడుతూ చివరికి ఓడిపోయా. ఆవేశంలో రాకెట్ను విరిచేశా. ఆ తర్వాత మా నాన్నను మళ్లీ కొత్తది కొనివ్వమని అడగడానికి భయమేసింది".
యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఇప్పటికీ కనీసం రెండ్రోజులకు ఒకసారి టెన్నిస్ ఆడతానని చెప్పాడు యువరాజ్. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు నిత్యం క్రీడల్లో పాల్గొనటానికి ఇష్టపడతారని అన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సచిన్ తనతో మాట్లాడుతూ.. "నాలుగైదు రోజులకు మించి క్రికెట్ ఆడకపోతే.. చాలా ఆందోళన చెందుతానని" చెప్పినట్లు యువరాజ్ వివరించాడు.
యువరాజ్ సింగ్ తన కెరీర్ మొత్తంలో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు.