ETV Bharat / sports

'అవకాశమొస్తే మళ్లీ నిరూపించుకుంటాను'

భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోలేదని, అవకాశం వస్తే నిరూపించుకుంటానని శిఖర్​ ధావన్ చెప్పాడు​. ఐపీఎల్​లో బయోబబుల్​ సురక్షితమేనని, ఆటగాళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపాడు.

author img

By

Published : Sep 7, 2020, 1:59 PM IST

I have not given up hope on Test comeback, says Shikhar Dhawan
టెస్టు జట్టులో తిరిగి స్థానం దక్కించుకుంటా: ధావన్​

టెస్టు జట్టులో తిరిగి స్థానం దక్కించుకునే విషయమై తనకు ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పాడు ఓపెనర్​ శిఖర్​ ధావన్​. సరైన అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటానని అన్నాడు. ఐపీఎల్​ బయోబబుల్​ విధానం గురించి మాట్లాడాడు.

"టెస్టు జట్టులో లేకపోయినంత మాత్రాన అవకాశాలను కోల్పోయినట్లు కాదు. గతేడాది రంజీలో సెంచరీ చేసి వన్టేల్లో స్థానం దక్కించుకున్నట్లే అవకాశం వస్తే మళ్లీ రుజువు చేసుకుంటాను. ఉత్తమ ప్రదర్శన చేస్తా. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ఆడాలి. అలానే ఎక్కువ పరుగులు చేస్తూ ఫిట్​నెస్​ నిరూపించుకోవాలి. వీటివల్లే టెస్టుల్లో స్థానం తిరిగి దక్కించుకుంటాను"

- శిఖర్​ ధావన్​, టీమ్​ఇండియా ఓపెనర్​

2013లో ఆస్ట్రేలియాపై టెస్టుతో ఈ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు ధావన్​. అందులో వేగంగా శతకం కొట్టి ఘనత సాధించాడు. చివరగా 2018 సెప్టెంబరులో ఇంగ్లాండ్​తో టెస్టు ఆడాడు. మొత్తంగా 34 టెస్టులాడి 2,315 పరుగులు​ చేశాడు​.

I have not given up hope on Test comeback, says Shikhar Dhawan
శిఖర్​ ధావన్​

నియంత్రణ ఉండాలి

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్న ధావన్​.. టోర్నీలో పాల్గొనడంలో భాగంగా యూఏఈలో ఉన్నాడు. "బయోబబుల్​ను నిర్వహించాలంటే కొన్ని సవాళ్లు ఉన్నాయి. కొత్త వారితో మాట్లాడకుండా, సన్నిహితంగా మెలగడం సహా రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండాలి. జనసంచారం ఎక్కువగా లేని ప్రదేశాలనే ఎంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ ఓ కుటుంబంలా చూసుకుంటుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, మిగిలిన వాళ్లు దీన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది" అని వెల్లడించాడు.

టెస్టు జట్టులో తిరిగి స్థానం దక్కించుకునే విషయమై తనకు ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పాడు ఓపెనర్​ శిఖర్​ ధావన్​. సరైన అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటానని అన్నాడు. ఐపీఎల్​ బయోబబుల్​ విధానం గురించి మాట్లాడాడు.

"టెస్టు జట్టులో లేకపోయినంత మాత్రాన అవకాశాలను కోల్పోయినట్లు కాదు. గతేడాది రంజీలో సెంచరీ చేసి వన్టేల్లో స్థానం దక్కించుకున్నట్లే అవకాశం వస్తే మళ్లీ రుజువు చేసుకుంటాను. ఉత్తమ ప్రదర్శన చేస్తా. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ఆడాలి. అలానే ఎక్కువ పరుగులు చేస్తూ ఫిట్​నెస్​ నిరూపించుకోవాలి. వీటివల్లే టెస్టుల్లో స్థానం తిరిగి దక్కించుకుంటాను"

- శిఖర్​ ధావన్​, టీమ్​ఇండియా ఓపెనర్​

2013లో ఆస్ట్రేలియాపై టెస్టుతో ఈ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు ధావన్​. అందులో వేగంగా శతకం కొట్టి ఘనత సాధించాడు. చివరగా 2018 సెప్టెంబరులో ఇంగ్లాండ్​తో టెస్టు ఆడాడు. మొత్తంగా 34 టెస్టులాడి 2,315 పరుగులు​ చేశాడు​.

I have not given up hope on Test comeback, says Shikhar Dhawan
శిఖర్​ ధావన్​

నియంత్రణ ఉండాలి

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్న ధావన్​.. టోర్నీలో పాల్గొనడంలో భాగంగా యూఏఈలో ఉన్నాడు. "బయోబబుల్​ను నిర్వహించాలంటే కొన్ని సవాళ్లు ఉన్నాయి. కొత్త వారితో మాట్లాడకుండా, సన్నిహితంగా మెలగడం సహా రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండాలి. జనసంచారం ఎక్కువగా లేని ప్రదేశాలనే ఎంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ ఓ కుటుంబంలా చూసుకుంటుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, మిగిలిన వాళ్లు దీన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది" అని వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.