వికెట్ కీపర్ అనూజ్ రావత్ (95 నాటౌట్; 85 బంతుల్లో 7x4, 6x6), కెప్టెన్ ప్రదీప్ సాంగ్వాన్ (58 నాటౌట్; 49 బంతుల్లో 6x4, 2x6) చెలరేగడం వల్ల విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో దిల్లీ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో దిల్లీ 4 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్పై నెగ్గింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు సాధించింది. కమల్సింగ్ (77), కునాల్ చండేలా (62) మెరిశారు. అనంతరం దిల్లీ 48.3 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఒక దశలో 146/6తో ఓటమి అంచుల్లో ఉన్న దిల్లీకి అనూజ్, ప్రదీప్లు 143 పరుగుల అజేయ భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు. నితీశ్ రాణా(81) రాణించాడు.
ఇదీ చదవండి: షాహిద్ అఫ్రిదికి అల్లుడవుతున్న పాక్ యువ బౌలర్