ETV Bharat / sports

క్రికెట్​కు తాకిన 'కరోనా' సెగ.. మొదటి టోర్నీ వాయిదా! - Bangladesh Cricket Board(BCB) news

కరోనా​ ప్రభావం ఇప్పటికే అన్ని రకాల క్రీడలనూ తాకగా.. తాజాగా క్రికెట్​కూ ఆ సెగ తగలింది. బంగ్లాదేశ్​లో​ ఈ నెలలో జరగాల్సిన ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ టీ20 మ్యాచ్​లు వాయిదా పడ్డాయి.

క్రికెట్​కు తాకిన 'కరోనా' సెగ.. మొదటి టోర్నీ వాయిదా!
క్రికెట్ వార్తలు
author img

By

Published : Mar 12, 2020, 7:33 AM IST

Updated : Mar 12, 2020, 8:28 AM IST

బంగ్లాదేశ్‌ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఆసియా ఎలెవన్​, ప్రపంచ ఎలెవన్​ మధ్య జరగాల్సిన టీ20​లు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ ప్రభావమే ఇందుకు కారణమని బంగ్లాదేశ్ క్రికెట్‌ సంఘం (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ చెప్పారు. నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నాడు. బహుశా.. కరోనా వల్ల వాయిదాపడ్డ తొలి క్రికెట్‌ టోర్నీ ఇదే కావొచ్చని తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతిని పురస్కరించుకొని ఈనెల 21, 22న ఆసియా, ప్రపంచ ఎలెవన్​ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్​లు జరగాల్సి ఉంది. భారీ స్థాయిలో వీటిని నిర్వహించాలని బీసీబీ నిర్ణయించింది. ఇందుకోసం ఆటగాళ్లను పంపించాలని ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు లేఖలు రాసింది. విరాట్‌ కోహ్లీ సహా నలుగురు క్రికెటర్లను ఆసియా XI జట్టులో ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐని కోరింది. మ్యాచ్​ల కన్నా ముందు ఏఆర్‌ రెహమాన్​తో సంగీత విభావరి ఏర్పాటుకు నిర్ణయించింది. కరోనా వైరస్‌ కారణంగా వీటిని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

" ఈ నెల 18న సంగీత విభావరి ఏర్పాటు చేయాలనుకున్నాం. సాధారణంగా అనుకొని తర్వాత భారీ స్థాయిలో జరపాలని నిర్ణయించాం. అదిప్పుడు 18న జరగడం లేదు. 21, 22న మ్యాచ్​ల నిర్వహణకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటగాళ్లు వస్తారనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు మేం సంగీత విభావరి, మ్యాచ్​లను వాయిదా వేస్తున్నాం. రెండు మూడు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకుంటున్నాం"

-- నజ్ముల్‌ హసన్‌, బీసీబీ అధ్యక్షుడు

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఆదివారం.. మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరిని నిర్బంధించినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. మనదేశంలోనూ 65మందికి కరోనా వైరస్​ సోకినట్టు వార్తలు వచ్చినా... కేంద్రం మాత్రం అధికారికంగా 60 మంది మాత్రమే బాధితులని వెల్లడించింది.

ఇదీ చదవండి...

టీ20 సిరీస్​: కోహ్లీ, రాహుల్​ X డుప్లెసిస్​, గేల్​

బంగ్లాదేశ్‌ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఆసియా ఎలెవన్​, ప్రపంచ ఎలెవన్​ మధ్య జరగాల్సిన టీ20​లు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ ప్రభావమే ఇందుకు కారణమని బంగ్లాదేశ్ క్రికెట్‌ సంఘం (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ చెప్పారు. నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నాడు. బహుశా.. కరోనా వల్ల వాయిదాపడ్డ తొలి క్రికెట్‌ టోర్నీ ఇదే కావొచ్చని తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతిని పురస్కరించుకొని ఈనెల 21, 22న ఆసియా, ప్రపంచ ఎలెవన్​ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్​లు జరగాల్సి ఉంది. భారీ స్థాయిలో వీటిని నిర్వహించాలని బీసీబీ నిర్ణయించింది. ఇందుకోసం ఆటగాళ్లను పంపించాలని ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు లేఖలు రాసింది. విరాట్‌ కోహ్లీ సహా నలుగురు క్రికెటర్లను ఆసియా XI జట్టులో ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐని కోరింది. మ్యాచ్​ల కన్నా ముందు ఏఆర్‌ రెహమాన్​తో సంగీత విభావరి ఏర్పాటుకు నిర్ణయించింది. కరోనా వైరస్‌ కారణంగా వీటిని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

" ఈ నెల 18న సంగీత విభావరి ఏర్పాటు చేయాలనుకున్నాం. సాధారణంగా అనుకొని తర్వాత భారీ స్థాయిలో జరపాలని నిర్ణయించాం. అదిప్పుడు 18న జరగడం లేదు. 21, 22న మ్యాచ్​ల నిర్వహణకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటగాళ్లు వస్తారనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు మేం సంగీత విభావరి, మ్యాచ్​లను వాయిదా వేస్తున్నాం. రెండు మూడు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకుంటున్నాం"

-- నజ్ముల్‌ హసన్‌, బీసీబీ అధ్యక్షుడు

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఆదివారం.. మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరిని నిర్బంధించినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. మనదేశంలోనూ 65మందికి కరోనా వైరస్​ సోకినట్టు వార్తలు వచ్చినా... కేంద్రం మాత్రం అధికారికంగా 60 మంది మాత్రమే బాధితులని వెల్లడించింది.

ఇదీ చదవండి...

టీ20 సిరీస్​: కోహ్లీ, రాహుల్​ X డుప్లెసిస్​, గేల్​

Last Updated : Mar 12, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.