ETV Bharat / sports

రైనా వేసుకున్న ట్యాటూ ఏంటో తెలుసా!

author img

By

Published : Aug 11, 2020, 3:46 PM IST

లాక్​డౌన్​ తర్వాత బ్యాటింగ్​ ప్రాక్టీసు మొదలుపెట్టిన భారత ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా.. వాటికి సంబంధించిన వీడియోలను తరచుగా సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తున్నాడు. తాజాగా తన కుమారుడి పేరును చేతిపై ట్యాటూ వేయించుకుంటున్న వీడియోను షేర్​ చేశాడు.

Chennai Super Kings star Suresh Raina gets his wife, son's name tattooed ahead of IPL 2020
నేను బ్రతకడానికి వాళ్లే కారణం: సురేశ్​ రైనా

సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా. టోర్నీ నిర్వహణ ప్రణాళిక రాకముందు నుంచే ఘజియాబాద్​లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నెట్స్​లో బ్యాటింగ్​ చేస్తున్న వీడియోలను తరచుగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు.

సురేశ్​ రైనా.. తాజాగా తన భార్య, పిల్లల పేర్లను చేతిమీద ట్యాటూ వేయించుకున్న ఫొటోను షేర్​ చేశాడు. ఎడమ మోచేతికి పై భాగంలో తన భార్య ప్రియాంక, దిగువన కుమార్తె గ్రేసియా పేర్లను గతంలోనే ట్యూటూ వేయించగా.. తాజాగా తన కుమారుడు రియో పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.

లాక్​డౌన్​ తర్వాత అవుట్​డోర్​లో బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెట్టిన భారతీయ క్రికెటర్లలో సురేశ్​ రైనా ఒకడు. ఘజియాబాద్​లోని స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​తో కలిసి నెలరోజులుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. తర్వలోనే చెన్నై యాజమాన్యం నిర్వహించే శిక్షణా శిబిరంలో చేరనున్నాడు రైనా. ఆగస్టు 22న యూఏఈకి పయనమయ్యేందుకు చెన్నై జట్టు సంసిద్ధమవుతుంది.

సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా. టోర్నీ నిర్వహణ ప్రణాళిక రాకముందు నుంచే ఘజియాబాద్​లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నెట్స్​లో బ్యాటింగ్​ చేస్తున్న వీడియోలను తరచుగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు.

సురేశ్​ రైనా.. తాజాగా తన భార్య, పిల్లల పేర్లను చేతిమీద ట్యాటూ వేయించుకున్న ఫొటోను షేర్​ చేశాడు. ఎడమ మోచేతికి పై భాగంలో తన భార్య ప్రియాంక, దిగువన కుమార్తె గ్రేసియా పేర్లను గతంలోనే ట్యూటూ వేయించగా.. తాజాగా తన కుమారుడు రియో పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.

లాక్​డౌన్​ తర్వాత అవుట్​డోర్​లో బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెట్టిన భారతీయ క్రికెటర్లలో సురేశ్​ రైనా ఒకడు. ఘజియాబాద్​లోని స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​తో కలిసి నెలరోజులుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. తర్వలోనే చెన్నై యాజమాన్యం నిర్వహించే శిక్షణా శిబిరంలో చేరనున్నాడు రైనా. ఆగస్టు 22న యూఏఈకి పయనమయ్యేందుకు చెన్నై జట్టు సంసిద్ధమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.