ETV Bharat / sports

బాబర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. తొలి టీ20 పాక్​ కైవసం - పాకిస్థాన్ జింబాబ్వే తొలి టీ20

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పాక్ సారథి బాబర్ అజామ్ (82) అద్భుత అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Captain Babar Azam leads Pakistan to big win over Zimbabwe
బాబర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. తొలి టీ20 పాక్​ కైవసం
author img

By

Published : Nov 7, 2020, 9:00 PM IST

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్​లో అర్ధసెంచరీతో చెలరేగిన కెప్టెన్ బాబర్ అజామ్ (82)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

157 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్​ జట్టులో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఓపెనర్ ఫకర్ జమాన్. తర్వాత హైదర్ అలీ (7) కూడా నిరాశపర్చాడు. తర్వాత మిడిలార్డర్​లో వచ్చిన హఫీజ్ (37)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు కెప్టెన్ బాబర్ అజామ్ (82).

Captain Babar Azam leads Pakistan to big win over Zimbabwe
జింబాబ్వే

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు అర్ధశతకంతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు యువ ఆటగాడు మధివెరా. 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అయినా మిగతావారు విఫలమైన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది జింబాబ్వే. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్​లో అర్ధసెంచరీతో చెలరేగిన కెప్టెన్ బాబర్ అజామ్ (82)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

157 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్​ జట్టులో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఓపెనర్ ఫకర్ జమాన్. తర్వాత హైదర్ అలీ (7) కూడా నిరాశపర్చాడు. తర్వాత మిడిలార్డర్​లో వచ్చిన హఫీజ్ (37)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు కెప్టెన్ బాబర్ అజామ్ (82).

Captain Babar Azam leads Pakistan to big win over Zimbabwe
జింబాబ్వే

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు అర్ధశతకంతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు యువ ఆటగాడు మధివెరా. 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అయినా మిగతావారు విఫలమైన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది జింబాబ్వే. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.