ETV Bharat / sports

క్యాబ్​ సెలక్టర్​కు కరోనా పాజిటివ్ - కాబ్ సెలక్టర్ సాగర్​మయి సేన్​శర్మకు కరోనా

బంగాల్ రంజీ మాజీ క్రికెటర్, ప్రస్తుత సెలక్టర్ సాగర్​మయి సేన్​శర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని క్యాబ్​ అధ్యక్షుడు వెల్లడించారు.

CAB selector Sagarmoy Sensharma tests positive for COVID-19
కాబ్ సెలక్టర్ సాగర్​మయి సేన్​శర్మ
author img

By

Published : May 30, 2020, 10:32 AM IST

బంగాల్ క్రికెట్ జట్టు సెలక్టర్ సాగరమయి సేన్​శర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బంగాల్ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ధ్రువీకరించారు.

"తొలుత సాగర్​మయి భార్యకు కరోనా సోకింది. ఆమె కోలుకున్న తర్వాత అతడు వైరస్ బారినపడ్డాడు. వైద్యపరీక్షల్లో మిగతా కుటుంబసభ్యులకు నెగిటివ్​గా తేలింది​" -అవిషేక్ దాల్మియా, క్యాబ్​ అధ్యక్షుడు

1989-90లో రంజీ విజేతగా నిలిచిన బంగాల్​ జట్టులో సాగర్​మయి సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇతడిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

శనివారం నాటికి బంగాల్​లో 4813 మంది కరోనా బారిన పడగా, 2736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1775 మంది వైరస్​ నుంచి కోలుకోగా, 302 మంది దీని ప్రభావం వల్ల మరణించారు.

బంగాల్ క్రికెట్ జట్టు సెలక్టర్ సాగరమయి సేన్​శర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బంగాల్ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ధ్రువీకరించారు.

"తొలుత సాగర్​మయి భార్యకు కరోనా సోకింది. ఆమె కోలుకున్న తర్వాత అతడు వైరస్ బారినపడ్డాడు. వైద్యపరీక్షల్లో మిగతా కుటుంబసభ్యులకు నెగిటివ్​గా తేలింది​" -అవిషేక్ దాల్మియా, క్యాబ్​ అధ్యక్షుడు

1989-90లో రంజీ విజేతగా నిలిచిన బంగాల్​ జట్టులో సాగర్​మయి సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇతడిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

శనివారం నాటికి బంగాల్​లో 4813 మంది కరోనా బారిన పడగా, 2736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1775 మంది వైరస్​ నుంచి కోలుకోగా, 302 మంది దీని ప్రభావం వల్ల మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.