ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు పైకి ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన(67/10) చేసిన ఇతడు... టెస్టుల్లో 500 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 269 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లిష్ జట్టు, 2-1 తేడాతో విజ్డెన్ ట్రోఫీని గెలుచుకుంది.
కరోనా కారణంగా మార్చి నుంచి మైదానంలో దిగకపోవడం వల్ల భారత క్రికెటర్ల ర్యాంక్లు పదిలమే. కోహ్లీ(2), పుజారా(7), రహానె(9) తమ స్థానాల్లోనే ఉన్నారు.
ఆల్రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్.. మూడు, ఐదు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో బ్రాడ్, ఏడు స్థానాలు పైకి వెళ్లడం వల్ల భారత స్టార్ బుమ్రా.. ర్యాంక్ కోల్పోయి ఎనిమిదికి పడిపోయాడు.
ఇది చదవండి: చివరి టెస్టులో గెలుపు.. విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్దే