ETV Bharat / sports

'పుజారాను ఎదుర్కోవడమంటే యుద్ధం చేసినట్లే' - pujara cummins

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో కోహ్లీ వెళ్లిపోయాక పుజారా వికెట్​ను పడగొట్టడమే పెద్ద లక్ష్యంగా ఆడినట్లు చెప్పాడు ఆసీస్​ పేసర్​ కమిన్స్​. అతడిని ఎదుర్కొనేటప్పుడు యుద్ధంలా అనిపిస్తుందని అన్నాడు.

pujara
పుజారా
author img

By

Published : Feb 11, 2021, 2:29 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​ తర్వాత పితృత్వ సెలవుల కారణంగా సారథి కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో తర్వాత మ్యాచుల్లో పుజారా వికెట్​ తీయడమే తొలి లక్ష్యంగా ఆడినట్లు చెప్పాడు ఆసీస్​ పేసర్​ కమిన్స్​.

"విరాట్​ వెళ్లిపోవడం వల్ల జట్టుకు అడ్డుగోడగా నిలబడే పుజారాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడాను. ఎందుకంటే అతడు క్రీజులో ఉంటే మ్యాచు ఫలితం(గెలుపు, ఓటమి, డ్రా) ఎలా ఉంటుందో చెప్పలేం. కొన్నేళ్లుగా జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనను ఎదుర్కొనేటప్పుడు యుద్ధం చేసినట్లు భావిస్తాను. సిడ్నీటెస్టు డ్రాగా ముగియడంలో, గబ్బా టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించి తనదైన మార్క్​ను సెట్​ చేశాడు. అతడిని ఎదుర్కోవడం ఎటువంటి బౌలర్​కైనా కష్టమే. శరీరానికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా తట్టుకుని అతడు ఆడే విధానం ప్రశంసనీయమైనది" అని కమిన్స్​ అన్నాడు.

గబ్బా టెస్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన రిషభ్​ పంత్​ను ప్రశంసించాడు కమిన్స్​. అతడు క్లాస్​ ప్లేయర్​ అని కితాబిచ్చాడు. కాగా, ఈ సిరీస్​లో ఆస్ట్రేలియాపై 2-1తేడాతో టీమ్​ఇండియా చారిత్రక విజయాన్ని సాధించింది.

ఇదీ చూడండి: హజారే ట్రోఫీకి నటరాజన్​ దూరం

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​ తర్వాత పితృత్వ సెలవుల కారణంగా సారథి కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో తర్వాత మ్యాచుల్లో పుజారా వికెట్​ తీయడమే తొలి లక్ష్యంగా ఆడినట్లు చెప్పాడు ఆసీస్​ పేసర్​ కమిన్స్​.

"విరాట్​ వెళ్లిపోవడం వల్ల జట్టుకు అడ్డుగోడగా నిలబడే పుజారాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడాను. ఎందుకంటే అతడు క్రీజులో ఉంటే మ్యాచు ఫలితం(గెలుపు, ఓటమి, డ్రా) ఎలా ఉంటుందో చెప్పలేం. కొన్నేళ్లుగా జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనను ఎదుర్కొనేటప్పుడు యుద్ధం చేసినట్లు భావిస్తాను. సిడ్నీటెస్టు డ్రాగా ముగియడంలో, గబ్బా టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించి తనదైన మార్క్​ను సెట్​ చేశాడు. అతడిని ఎదుర్కోవడం ఎటువంటి బౌలర్​కైనా కష్టమే. శరీరానికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా తట్టుకుని అతడు ఆడే విధానం ప్రశంసనీయమైనది" అని కమిన్స్​ అన్నాడు.

గబ్బా టెస్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన రిషభ్​ పంత్​ను ప్రశంసించాడు కమిన్స్​. అతడు క్లాస్​ ప్లేయర్​ అని కితాబిచ్చాడు. కాగా, ఈ సిరీస్​లో ఆస్ట్రేలియాపై 2-1తేడాతో టీమ్​ఇండియా చారిత్రక విజయాన్ని సాధించింది.

ఇదీ చూడండి: హజారే ట్రోఫీకి నటరాజన్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.