ETV Bharat / sports

కరోనా కలవరం.. టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ - వినూ మన్కడ్ టోర్నీ రద్దు

భారత్​లో కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల పలు టోర్నీలు రద్దు చేసింది బీసీసీఐ. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సమాచారం అందించారు.

BCCI
బీసీసీఐ
author img

By

Published : Mar 17, 2021, 6:59 AM IST

భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వయో విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. త్వరలో జరగనున్న వినూ మన్కడ్‌ ట్రోపీతో సహా అన్ని టోర్నీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం అందించారు.

అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా భారత్‌- ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ జరుగుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మంగళవారం జరిగిన మూడో టీ20 ప్రేక్షకులు లేకుండానే జరిగింది. మిగతా మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే తెలిపింది.

భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వయో విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. త్వరలో జరగనున్న వినూ మన్కడ్‌ ట్రోపీతో సహా అన్ని టోర్నీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం అందించారు.

అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా భారత్‌- ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ జరుగుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మంగళవారం జరిగిన మూడో టీ20 ప్రేక్షకులు లేకుండానే జరిగింది. మిగతా మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.