ETV Bharat / sports

'ఐపీఎల్ ఆలస్యానికి ఆయనే కారణం'

author img

By

Published : Jun 17, 2020, 10:06 PM IST

టీ20 ప్రపంచకప్​ విషయంలో ఐసీసీ జాప్యం చేస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. దీనివల్ల ఐపీఎల్​ ప్రిపరేషన్​కు ఆలస్యమవుతోందని అన్నారు. త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఐపీఎల్ ఆలస్యానికి ఆయనే కారణం: బీసీసీఐ
ఐపీఎల్ టీ20 ప్రపంచకప్

ఐపీఎల్​ ప్రిపరేషన్​ ఆలస్యం కావడానికి కారణం ఐసీసీ ఛైర్మన్ శశాంక్​ మనోహర్ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ఒకరు ఆరోపించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ను జరపడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎడ్డింగ్స్ చెప్పిన సరే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ ఎందుకు జాప్యం చేస్తోందని అన్నారు.

Shashank Manohar
ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్

"పదవీకాలం ముగిసిన ఐసీసీ అధ్యక్షుడు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్​ జరపలేమని చెబుతున్నా సరే దానిపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారు. బీసీసీఐతో ఆడుకుంటున్నారా?" అని ఓ అధికారి అన్నారు.

అక్టోబరు 18-నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్​ నిర్వహణ విషయమై ఈనెల 10న ఐసీసీ భేటీ జరిగింది. కానీ దానిపై నిర్ణయాన్ని జులైకి వాయిదా వేశారు. అయితే టోర్నీపై త్వరగా స్పష్టతనివ్వాలని బీసీసీఐ అధికారి కోరారు. ఇది బీసీసీఐ లేదంటే ఐపీఎల్ కోసమో కాదని వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్​లు కోసమని అన్నారు. లేకపోతే అందరికి సమయం వృథా అవుతుందని చెప్పారు.

GANGULY
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

భారత్‌లో కుదరకపోతే ఐపీఎల్‌ను శ్రీలంక, యూఏఈలో నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదనలపై బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్ స్పందించారు. "అన్ని విధాలుగా పరిశీలించి మా ఆటగాళ్లు ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడ నిర్వహిస్తాం" అని చెప్పారు. ఐపీఎల్ నిర్వహణ భారత్‌లో కుదరకపోతే శ్రీలంక, యూఏఈలో జరపాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ఐపీఎల్​ ప్రిపరేషన్​ ఆలస్యం కావడానికి కారణం ఐసీసీ ఛైర్మన్ శశాంక్​ మనోహర్ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ఒకరు ఆరోపించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ను జరపడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎడ్డింగ్స్ చెప్పిన సరే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ ఎందుకు జాప్యం చేస్తోందని అన్నారు.

Shashank Manohar
ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్

"పదవీకాలం ముగిసిన ఐసీసీ అధ్యక్షుడు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్​ జరపలేమని చెబుతున్నా సరే దానిపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారు. బీసీసీఐతో ఆడుకుంటున్నారా?" అని ఓ అధికారి అన్నారు.

అక్టోబరు 18-నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్​ నిర్వహణ విషయమై ఈనెల 10న ఐసీసీ భేటీ జరిగింది. కానీ దానిపై నిర్ణయాన్ని జులైకి వాయిదా వేశారు. అయితే టోర్నీపై త్వరగా స్పష్టతనివ్వాలని బీసీసీఐ అధికారి కోరారు. ఇది బీసీసీఐ లేదంటే ఐపీఎల్ కోసమో కాదని వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్​లు కోసమని అన్నారు. లేకపోతే అందరికి సమయం వృథా అవుతుందని చెప్పారు.

GANGULY
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

భారత్‌లో కుదరకపోతే ఐపీఎల్‌ను శ్రీలంక, యూఏఈలో నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదనలపై బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్ స్పందించారు. "అన్ని విధాలుగా పరిశీలించి మా ఆటగాళ్లు ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడ నిర్వహిస్తాం" అని చెప్పారు. ఐపీఎల్ నిర్వహణ భారత్‌లో కుదరకపోతే శ్రీలంక, యూఏఈలో జరపాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.