బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే జాతీయ కాంట్రాక్టును ఉల్లంఘించిన కారణంగా అతడిపై వేటు పడనుంది. టీమిండియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ విషయం ఆ జట్టును కలవరపెడుతోంది.
"బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిబంధనల ప్రకారం బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాడు ఏ టెలికాం సంస్థతోనూ ఒప్పందం చేసుకోకూడదు. మా దేశానికి చెందిన ప్రాంతీయ టెలికాం సంస్థ గ్రామీణఫోన్.. తమ బ్రాండ్ అంబాసిడర్గా షకిబ్తో ఒప్పందం చేసుకున్నట్లు ఈనెల 22న ప్రకటించింది. ఈ విషయంపై షకీబ్ను వివరణ కోరాం. ఒకవేళ బోర్డు నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. టెలికాం సంస్థ ఒప్పందంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాడితో పాటు కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని కోరతాం"
-నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు.
ఇటీవలే బంగ్లా క్రికెటర్లు.. తమ 11 పాయింట్ల డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపగా బీసీబీ అంగీకరించింది. ఇది షకిబ్ నేతృత్వంలో జరగడం, బోర్డు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలడం... అతడి కెరీర్ను ప్రమాదంలో పడేశాయి.
ఇదీ చూడండి : 'కోహ్లీసేన ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది'