ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: ఒక్కొక్కరికి ఒక్క టికెట్​ మాత్రమే..!

author img

By

Published : Mar 10, 2020, 7:16 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ టికెట్ అమ్మకాల విధానాన్ని మార్చింది. ఒక వ్యక్తికి ఒక టికెట్ మాత్రమే విక్రయించేలా నిర్ణయం తీసుకుంది బీసీబీ.

Ban vs Zim 1st T20: BCB changes ticket selling policy due to Coronavirus concerns
కరోనా ఎఫెక్ట్​: ఒక్కరికి ఒక్క టికెట్టు మాత్రమే..!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న క్రీడా టోర్నీలపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్.. కొద్దికాలంలోనే ఇతర దేశాలకు వ్యాపించింది. దక్షిణ ఆసియా దేశాల్లోనూ (కొవిడ్​-19) కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 మ్యాచ్​లు ఎలాంటి అడ్డంకి లేకుండా సాగిపోతున్నాయి. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వే మొదటి టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాలు పరిమితం చేసి.. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని బంగ్లా నిర్ణయించింది.

నిపుణులు తెలిపిన విధంగా బహిరంగ సభలను నివారించటానికి బీసీబీ తన వంతు చర్య తీసుకుంది. ఈ ఒక్క మ్యాచ్​ తప్ప.. ఆ దేశంలో జరిగే ఇతర మ్యాచ్​ల గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే తదుపరి మ్యాచ్​ల కోసం ప్రణాళికలు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్​ వేదికగా ఆసియా ఎలెవన్​, వరల్డ్​ ఎలెవన్​ జట్ల సిరీస్​ ఈ నెలాఖరులో జరగవచ్చని సమాచారం.

తాజాగా బంగ్లాదేశ్​ పితామహుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ శతాబ్ద జయంతి సందర్భంగా ఒక కచేరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి హంగు ఆర్భాటాలేవి లేకుండా సాధారణంగా ఉత్సవాలు జరపాలని ఆ దేశం నిర్ణయించినట్టు సమాచారం.

ఇదీ చూడండి.. 'షెఫాలీ కంటతడి పెట్టుకోవడం చూడలేకపోయా'

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న క్రీడా టోర్నీలపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్.. కొద్దికాలంలోనే ఇతర దేశాలకు వ్యాపించింది. దక్షిణ ఆసియా దేశాల్లోనూ (కొవిడ్​-19) కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 మ్యాచ్​లు ఎలాంటి అడ్డంకి లేకుండా సాగిపోతున్నాయి. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వే మొదటి టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాలు పరిమితం చేసి.. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని బంగ్లా నిర్ణయించింది.

నిపుణులు తెలిపిన విధంగా బహిరంగ సభలను నివారించటానికి బీసీబీ తన వంతు చర్య తీసుకుంది. ఈ ఒక్క మ్యాచ్​ తప్ప.. ఆ దేశంలో జరిగే ఇతర మ్యాచ్​ల గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే తదుపరి మ్యాచ్​ల కోసం ప్రణాళికలు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్​ వేదికగా ఆసియా ఎలెవన్​, వరల్డ్​ ఎలెవన్​ జట్ల సిరీస్​ ఈ నెలాఖరులో జరగవచ్చని సమాచారం.

తాజాగా బంగ్లాదేశ్​ పితామహుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ శతాబ్ద జయంతి సందర్భంగా ఒక కచేరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి హంగు ఆర్భాటాలేవి లేకుండా సాధారణంగా ఉత్సవాలు జరపాలని ఆ దేశం నిర్ణయించినట్టు సమాచారం.

ఇదీ చూడండి.. 'షెఫాలీ కంటతడి పెట్టుకోవడం చూడలేకపోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.