ETV Bharat / sports

అరంగేట్ర టెస్టు సిరీస్​లోనే అక్షర్​ రికార్డు- యాష్​ మరో ఘనత

author img

By

Published : Mar 6, 2021, 6:03 PM IST

ఇంగ్లాండ్​తో 3 మ్యాచుల్లోనే మొత్తం 27 వికెట్లు తీసి.. తన తొలి టెస్టు సిరీస్​నే చిరస్మరణీయంగా మలుచుకున్నాడు భారత ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​. ఇలా అరంగేట్ర సిరీస్​లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో దిలీప్​ దోషీతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్​ఇండియా స్పిన్నర్​ అశ్విన్​ కూడా టెస్టుల్లో పలు ఘనతలు సాధించాడు.

Axar Patel
అరంగేట్ర టెస్టు సిరీస్​లోనే అక్షర్​ రికార్డు

భారత్​ ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​.. అరంగేట్ర టెస్టు సిరీస్​లోనే అదరగొట్టాడు. మొత్తం 27 వికెట్లు పడగొట్టి.. భారత మాజీ ఆటగాడు దిలీప్​ దోషీ రికార్డును సమం చేశాడు.

దిలీప్​ ఆరు మ్యాచుల్లో 27 వికెట్లు తీయగా.. అక్షర్​ కేవలం 3 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్​తో​ జరిగిన రెండో టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడీ లెఫ్టార్మ్​ స్పిన్నర్​. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీశాడు. మూడో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్​లో 6, రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీశాడు.

చివరి టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్​లో 4, రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 27 వికెట్లతో తొలి సిరీస్​నే చిరస్మరణీయంగా మలుచుకున్నాడు.

అశ్విన్​ 30వ సారి..

మరో భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ కూడా ఇంగ్లాండ్​తో సిరీస్​లో​ పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీసి భారత్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఇన్నింగ్స్​లో 5 వికెట్ల ఫీట్​ చేయడం అశ్విన్​కు ఇది 30వ సారి. సిరీస్​లో 32 వికెట్లు పడగొట్టిన అతడికే మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​ దక్కింది.

ఇంకా.. 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు రెండు టెస్టు సిరీస్​ల్లో పడగొట్టిన ఏకైక భారత బౌలర్​ అశ్వినే.

ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్​గా అశ్విన్​

భారత్​ ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​.. అరంగేట్ర టెస్టు సిరీస్​లోనే అదరగొట్టాడు. మొత్తం 27 వికెట్లు పడగొట్టి.. భారత మాజీ ఆటగాడు దిలీప్​ దోషీ రికార్డును సమం చేశాడు.

దిలీప్​ ఆరు మ్యాచుల్లో 27 వికెట్లు తీయగా.. అక్షర్​ కేవలం 3 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్​తో​ జరిగిన రెండో టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడీ లెఫ్టార్మ్​ స్పిన్నర్​. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీశాడు. మూడో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్​లో 6, రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీశాడు.

చివరి టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్​లో 4, రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 27 వికెట్లతో తొలి సిరీస్​నే చిరస్మరణీయంగా మలుచుకున్నాడు.

అశ్విన్​ 30వ సారి..

మరో భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ కూడా ఇంగ్లాండ్​తో సిరీస్​లో​ పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీసి భారత్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఇన్నింగ్స్​లో 5 వికెట్ల ఫీట్​ చేయడం అశ్విన్​కు ఇది 30వ సారి. సిరీస్​లో 32 వికెట్లు పడగొట్టిన అతడికే మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​ దక్కింది.

ఇంకా.. 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు రెండు టెస్టు సిరీస్​ల్లో పడగొట్టిన ఏకైక భారత బౌలర్​ అశ్వినే.

ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్​గా అశ్విన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.