ETV Bharat / sports

'కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే ఆసీస్​దే విజయం'

author img

By

Published : Jul 17, 2020, 4:19 PM IST

డిసెంబరులో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియా బౌలర్లు.. కోహ్లీని ఒత్తిడికి గురయ్యేలా చేయాలని ఆసీస్​ మాజీ పేసర్​ బ్రెట్​ లీ తెలిపాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్​ఇండియాపై కంగారూ జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Australia must put Kohli under pressure early in the series: Lee
కోహ్లీ

ఈ ఏడాది చివర్లో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియా​ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్​ బ్రెట్​ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా డిసెంబర్ 3న తొలి మ్యాచ్​లో ఇరుజట్లు తలపడనున్న నేపథ్యంలో.. లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో కోహ్లీ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు.. 2-1తేడాతో కప్పు కైవసం చేసుకుంది. ఆసీస్​లో టెస్టు సిరీస్​ గెలిచిన తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులోకి స్టీవ్​ స్మిత్​, డేవిడ్​ వార్నర్​ తిరిగి రావడం వల్ల.. సొంతగడ్డపై కంగారూ జట్టు విజృంభించే అవకాశం ఉందని లీ తెలిపాడు.

Australia must put Kohli under pressure early in the series: Lee
కోహ్లీ

"నేను ఎంతగానో ఎదురు చూసే ఉత్తమ సిరీస్​ల్లో ఇది ఒకటి. ఈసారి ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ, టీమ్​ఇండియా.. ఆసీస్​కు గట్టిపోటీ ఇస్తుంది. అయితే, నా వరకు ఆసీస్​ తన సొంత గడ్డపై చాలా బలంగా ఉంటుందని అనుకుంటున్నా."

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్​

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే.. ఆస్ట్రేలియాదే విజయమని అన్నాడు లీ. "కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అతనికి బౌలింగ్​ చేసే సమయంలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ఈ సిరీస్​ ప్రారంభంలో ఆసీస్​ బౌలర్లు కోహ్లీని ఒత్తిడికి గురి చేయగలిగితే.. కంగారూ జట్టు ఆధిపత్యం వహించే అవకాశం ఉంది." అని బ్రెట్​ లీ పేర్కొన్నాడు.

Australia must put Kohli under pressure early in the series: Lee
కోహ్లీ

అంతే కాకుండా, భారత జట్టులో బలమైన పేసర్లు ఉన్నారని, గత పర్యటనలో బౌలర్లు చూపిన స్థిరత్వమే టీమ్​ఇండియా విజయానికి చేరువయ్యేలా చేసిందని వివరించాడు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని.. భారత పేసర్లు పోటీకి సిద్ధంగా ఉంటారని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి:ట్రైనింగ్​ ఇస్తే ఇప్పుడూ క్రికెట్​ ఆడేస్తా: గంగూలీ

ఈ ఏడాది చివర్లో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​లో ఆస్ట్రేలియా​ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్​ బ్రెట్​ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా డిసెంబర్ 3న తొలి మ్యాచ్​లో ఇరుజట్లు తలపడనున్న నేపథ్యంలో.. లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో కోహ్లీ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు.. 2-1తేడాతో కప్పు కైవసం చేసుకుంది. ఆసీస్​లో టెస్టు సిరీస్​ గెలిచిన తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులోకి స్టీవ్​ స్మిత్​, డేవిడ్​ వార్నర్​ తిరిగి రావడం వల్ల.. సొంతగడ్డపై కంగారూ జట్టు విజృంభించే అవకాశం ఉందని లీ తెలిపాడు.

Australia must put Kohli under pressure early in the series: Lee
కోహ్లీ

"నేను ఎంతగానో ఎదురు చూసే ఉత్తమ సిరీస్​ల్లో ఇది ఒకటి. ఈసారి ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ, టీమ్​ఇండియా.. ఆసీస్​కు గట్టిపోటీ ఇస్తుంది. అయితే, నా వరకు ఆసీస్​ తన సొంత గడ్డపై చాలా బలంగా ఉంటుందని అనుకుంటున్నా."

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్​

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే.. ఆస్ట్రేలియాదే విజయమని అన్నాడు లీ. "కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అతనికి బౌలింగ్​ చేసే సమయంలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ఈ సిరీస్​ ప్రారంభంలో ఆసీస్​ బౌలర్లు కోహ్లీని ఒత్తిడికి గురి చేయగలిగితే.. కంగారూ జట్టు ఆధిపత్యం వహించే అవకాశం ఉంది." అని బ్రెట్​ లీ పేర్కొన్నాడు.

Australia must put Kohli under pressure early in the series: Lee
కోహ్లీ

అంతే కాకుండా, భారత జట్టులో బలమైన పేసర్లు ఉన్నారని, గత పర్యటనలో బౌలర్లు చూపిన స్థిరత్వమే టీమ్​ఇండియా విజయానికి చేరువయ్యేలా చేసిందని వివరించాడు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని.. భారత పేసర్లు పోటీకి సిద్ధంగా ఉంటారని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి:ట్రైనింగ్​ ఇస్తే ఇప్పుడూ క్రికెట్​ ఆడేస్తా: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.