ETV Bharat / sports

గబ్బా​ టెస్టు: తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 369​ ఆలౌట్​

author img

By

Published : Jan 16, 2021, 7:42 AM IST

టీమ్​ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. లబుషేన్(108)​ సెంచరీతో ఆకట్టుకున్నాడు. నటరాజన్​, శార్దూల్, వాషింగ్టన్​ సుందర్​ ముగ్గురూ మూడేసి వికెట్లు తీసి రాణించారు.

aus
ఆసీస్​

టీమ్​ఇండియాతో జరుగుతోన్న నిర్ణయాత్మక నాలుగో(చివరి) టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లబుషేన్​(108) సెంచరీకి తోడు టిమ్​ పైన్​(50), గ్రీన్​(47) రాణించడం వల్ల ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్​నైట్​ స్కోరు 274/5తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి సెషన్​లోనే వరుస వికెట్లను కోల్పోయింది. తొలుత కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50), శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్(47)‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం శార్దుల్‌ వేసిన మరుసటి ఓవర్‌లో కమిన్స్‌(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్‌ 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి.. 104 ఓవర్లకు ఆసీస్​ 332/8తో నిలిచింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చి మిచెల్​ స్టార్క్​(16 ), నాథన్​ లయన్​(24), జోష్​ హేజిల్​వుజ్​(11 ) స్కోరును ముందుకు పరుగెత్తించారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో రెండో రోజు తొలి సెషన్ పూర్తయ్యేసరికి 369 పరుగులు చేసి ఆలౌటైంది. ​నటరాజన్​, శార్దూల్​ ఠాకూర్, వాషింగ్టన్​ సుందర్​ ముగ్గురూ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్​కు ఒక వికెట్​ దక్కింది.

టీమ్​ఇండియాతో జరుగుతోన్న నిర్ణయాత్మక నాలుగో(చివరి) టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లబుషేన్​(108) సెంచరీకి తోడు టిమ్​ పైన్​(50), గ్రీన్​(47) రాణించడం వల్ల ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్​నైట్​ స్కోరు 274/5తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి సెషన్​లోనే వరుస వికెట్లను కోల్పోయింది. తొలుత కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50), శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్(47)‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం శార్దుల్‌ వేసిన మరుసటి ఓవర్‌లో కమిన్స్‌(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్‌ 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి.. 104 ఓవర్లకు ఆసీస్​ 332/8తో నిలిచింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చి మిచెల్​ స్టార్క్​(16 ), నాథన్​ లయన్​(24), జోష్​ హేజిల్​వుజ్​(11 ) స్కోరును ముందుకు పరుగెత్తించారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో రెండో రోజు తొలి సెషన్ పూర్తయ్యేసరికి 369 పరుగులు చేసి ఆలౌటైంది. ​నటరాజన్​, శార్దూల్​ ఠాకూర్, వాషింగ్టన్​ సుందర్​ ముగ్గురూ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్​కు ఒక వికెట్​ దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.