ETV Bharat / sports

నటరాజన్​కు ఇవ్వనప్పుడు కోహ్లీకి ఎందుకిచ్చారు? - నటరాజన్​కు పితృత్వ సెలవులు

టీమ్​ఇండియా యాజమాన్యం.. ఆటగాళ్ల పట్ల వివక్ష చూపుతుందని ఆరోపించాడు మాజీ సారథి సునీల్​ గావస్కర్​. సారథి కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చినప్పుడు.. నటరాజన్​కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు.

natarajan
నటరాజన్​
author img

By

Published : Dec 23, 2020, 8:07 PM IST

Updated : Dec 23, 2020, 9:15 PM IST

టీమ్ఇండియా​ మేనేజ్​మెంట్​పై మండిపడ్డాడు భారత మాజీ సారథి సునీల్​ గావస్కర్​. జట్టు యాజమాన్యం ఒక్కో ఆటగాడి పట్ల ఒక్కో రూల్​ అవలంబిస్తోందని ఆరోపించాడు.

టీమ్​ఇండియా సారథి కోహ్లీ.. తొలి టెస్టు పూర్తవ్వగానే పితృత్వ సెలవులపై స్వదేశానికి బయలుదేరాడు. అయితే ఐపీఎల్​ ప్లేఆఫ్స్​ సమయంలో బౌలర్ టి.నటరాజన్​కు బిడ్డ పుట్టింది. కానీ అతడు స్వదేశానికి తిరిగి రాలేదు. అతడికి పితృత్వ సెలవులు ఇవ్వలేదని తెలిసింది. ఇదే విషయంపై మాట్లాడిన గావస్కర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"నటరాజన్​ కొత్తగా వచ్చాడు కాబట్టి పితృత్వ సెలవులు ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతడి ఆటతీరుకు మెచ్చిన సెలక్షన్​ కమిటీ.. ఆస్ట్రేలియా పర్యటనలో తుదిజట్టులో చోటు కల్పించనప్పటికీ నెట్​బౌలర్​గా తీసుకుంది. ఐపీఎల్ అవ్వగానే నేరుగా ఆసీస్​కు తీసుకెళ్లింది. ఆ తర్వాత తుది జట్టులో అనూహ్యంగా అతడికి అవకాశం రావడం వల్ల మరోసారి అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. జనవరి మూడో వారంలో సిరీస్​ పూర్తవ్వగానే స్వదేశానికి వెళ్లి తొలిసారి తన బిడ్డను చూడబోతున్నాడు. అది భారత క్రికెట్​ అంటే. ఏదేమైనప్పటికీ టీమ్​మేనేజ్​మెంట్​లో వివక్ష చూపిస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్​. కావాలంటే ఈ విషయాన్ని రవిచంద్రన్​ అశ్విన్​, నటరాజన్​ను అడగండి."

-సునీల్​ గావస్కర్​, టీమ్​ఇండియా మాజీ సారథి.

కాగా, తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమ్​ఇండియా డిసెంబరు 26 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో గెలవడం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఆసీస్​ 1-0తో సిరీస్​ ఆధిపత్యంలో ఉంది.

ఇదీ చూడండి : నేను పితృత్వ సెల‌వులు తీసుకోలేదు: గావస్కర్​

టీమ్ఇండియా​ మేనేజ్​మెంట్​పై మండిపడ్డాడు భారత మాజీ సారథి సునీల్​ గావస్కర్​. జట్టు యాజమాన్యం ఒక్కో ఆటగాడి పట్ల ఒక్కో రూల్​ అవలంబిస్తోందని ఆరోపించాడు.

టీమ్​ఇండియా సారథి కోహ్లీ.. తొలి టెస్టు పూర్తవ్వగానే పితృత్వ సెలవులపై స్వదేశానికి బయలుదేరాడు. అయితే ఐపీఎల్​ ప్లేఆఫ్స్​ సమయంలో బౌలర్ టి.నటరాజన్​కు బిడ్డ పుట్టింది. కానీ అతడు స్వదేశానికి తిరిగి రాలేదు. అతడికి పితృత్వ సెలవులు ఇవ్వలేదని తెలిసింది. ఇదే విషయంపై మాట్లాడిన గావస్కర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"నటరాజన్​ కొత్తగా వచ్చాడు కాబట్టి పితృత్వ సెలవులు ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతడి ఆటతీరుకు మెచ్చిన సెలక్షన్​ కమిటీ.. ఆస్ట్రేలియా పర్యటనలో తుదిజట్టులో చోటు కల్పించనప్పటికీ నెట్​బౌలర్​గా తీసుకుంది. ఐపీఎల్ అవ్వగానే నేరుగా ఆసీస్​కు తీసుకెళ్లింది. ఆ తర్వాత తుది జట్టులో అనూహ్యంగా అతడికి అవకాశం రావడం వల్ల మరోసారి అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. జనవరి మూడో వారంలో సిరీస్​ పూర్తవ్వగానే స్వదేశానికి వెళ్లి తొలిసారి తన బిడ్డను చూడబోతున్నాడు. అది భారత క్రికెట్​ అంటే. ఏదేమైనప్పటికీ టీమ్​మేనేజ్​మెంట్​లో వివక్ష చూపిస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్​. కావాలంటే ఈ విషయాన్ని రవిచంద్రన్​ అశ్విన్​, నటరాజన్​ను అడగండి."

-సునీల్​ గావస్కర్​, టీమ్​ఇండియా మాజీ సారథి.

కాగా, తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమ్​ఇండియా డిసెంబరు 26 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో గెలవడం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఆసీస్​ 1-0తో సిరీస్​ ఆధిపత్యంలో ఉంది.

ఇదీ చూడండి : నేను పితృత్వ సెల‌వులు తీసుకోలేదు: గావస్కర్​

Last Updated : Dec 23, 2020, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.