ETV Bharat / sports

కీలక పోరు కోసం భారత్-ఇంగ్లాండ్ సిద్ధం

author img

By

Published : Mar 3, 2021, 5:35 PM IST

సిరీస్‌ ఫలితాన్ని తేల్చే కీలక నాలుగో టెస్టు కోసం భారత్‌-ఇంగ్లాండ్‌ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉండగా.. సమం చేసేందుకు ఇంగ్లాండ్‌ ప్రణాళికలు రచిస్తోంది. నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా, గెలిచినా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధిస్తుంది. మొతేరాలో మరోసారి స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేశారన్న వార్తల నేపథ్యంలో ఇరుజట్లు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.

Unprepared England face Motera Test
కీలక పోరు కోసం భారత్-ఇంగ్లాండ్ సిద్ధం

గుజరాత్‌లోని మొతేరా వేదికగా గురువారం నుంచి జరగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు భారత్‌-ఇంగ్లాండ్‌ జట్లు సమాయత్తమయ్యాయి. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌ కావడం వల్ల ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు, మూడో టెస్టుల్లో విజయాలు సాధించిన భారత్‌.. మరోసారి అలాంటి ఫలితాన్నే పునారవృతం చేయాలని భావిస్తోంది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. టీమ్ఇండియాను బ్యాటింగ్‌ ఇంకా కలవరపెడుతోంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్పిన్నర్ అశ్విన్‌ నిలవడం.. భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని చాటుతోంది. కష్టతరమైన చెపాక్ పిచ్‌పై అశ్విన్‌ శతకంతో రాణించినా.. మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. స్పిన్‌ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీ రెండు అర్ధ శతకాలతో రాణించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. రహానె, పుజారా, గిల్, రిషబ్‌ పంత్‌ నుంచి అభిమానులు భారీ స్కోర్లు ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ సత్తా చాటితే టీమ్ఇండియా విజయం ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు.

మరోసారి స్పిన్ పిచ్?

మొతేరాలో మరోసారి స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. టీమ్ఇండియా స్పిన్నర్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మూడో టెస్టును రెండు రోజుల్లోనే ముగించిన స్పిన్నర్లు.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. మొదటి మూడు టెస్టుల్లో 60 ఇంగ్లాండ్‌ వికెట్లలో 49 స్పిన్నర్లే తీశారు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలం కొనసాగితే రూట్‌ సేనకు తిప్పలు తప్పవు. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల అతని స్థానంలో ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్‌ పిచ్‌పై ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియా భావిస్తే వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ జట్టులోకి రావచ్చు.

ఇంగ్లాండ్ గాడిన పడుతుందా?

గత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. రెండు, మూడు టెస్టుల్లో రూట్‌సేన బ్యాటింగ్‌లో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఆ అడ్డంకిని అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో రూట్‌ తర్వాత ఆ స్థాయిలో పరుగులు సాధించిన ఆటగాడు లేకపోవడం.. బ్రిటీష్‌ జట్టును కలవరపెడుతోంది. రూట్‌ సహా బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జాక్ క్రాలే, డోమ్ సిబ్లీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బౌలర్లు ఆశించిన మేర రాణించకపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకుని తప్పు చేశామని.. సారథి రూట్‌ అంగీకరించాడు. నాలుగో టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌లో స్థిరంగా రాణిస్తున్న స్పిన్నర్‌ లీచ్‌కు తోడుగా బెస్‌.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లకు సవాల్‌ విసరనున్నాడు..

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనలే లక్ష్యంగా!

ఈ మ్యాచ్‌లో గెలిచినా లేదా డ్రా చేసుకున్నా టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోతే కోహ్లీసేనకు అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు డ్రా కోసం ఆడుతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. వీటిని మాజీలు ఖండించారు. సారథి కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిలది ఎప్పుడూ గెలుపు కోసమే ఆడే మనస్తత్వమని.. వారు రక్షణాత్మక ఆట ఆడటానికి ఇష్టపడరని మాజీలు అంచనా వేశారు. డ్రా కోసమే ఆడితే అది ఓటమికి దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని ఇంగ్లాండ్‌ ఇప్పటికే కోల్పోయింది. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది..

ఇవీ చూడండి: అవి పిచ్​లా లేక పంట పొలాలా?.. ఈటీవీ భారత్​తో కర్సన్ ఘర్వీ

గుజరాత్‌లోని మొతేరా వేదికగా గురువారం నుంచి జరగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు భారత్‌-ఇంగ్లాండ్‌ జట్లు సమాయత్తమయ్యాయి. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌ కావడం వల్ల ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు, మూడో టెస్టుల్లో విజయాలు సాధించిన భారత్‌.. మరోసారి అలాంటి ఫలితాన్నే పునారవృతం చేయాలని భావిస్తోంది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. టీమ్ఇండియాను బ్యాటింగ్‌ ఇంకా కలవరపెడుతోంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్పిన్నర్ అశ్విన్‌ నిలవడం.. భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని చాటుతోంది. కష్టతరమైన చెపాక్ పిచ్‌పై అశ్విన్‌ శతకంతో రాణించినా.. మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. స్పిన్‌ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీ రెండు అర్ధ శతకాలతో రాణించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. రహానె, పుజారా, గిల్, రిషబ్‌ పంత్‌ నుంచి అభిమానులు భారీ స్కోర్లు ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ సత్తా చాటితే టీమ్ఇండియా విజయం ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు.

మరోసారి స్పిన్ పిచ్?

మొతేరాలో మరోసారి స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. టీమ్ఇండియా స్పిన్నర్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మూడో టెస్టును రెండు రోజుల్లోనే ముగించిన స్పిన్నర్లు.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. మొదటి మూడు టెస్టుల్లో 60 ఇంగ్లాండ్‌ వికెట్లలో 49 స్పిన్నర్లే తీశారు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలం కొనసాగితే రూట్‌ సేనకు తిప్పలు తప్పవు. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల అతని స్థానంలో ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్‌ పిచ్‌పై ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియా భావిస్తే వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ జట్టులోకి రావచ్చు.

ఇంగ్లాండ్ గాడిన పడుతుందా?

గత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. రెండు, మూడు టెస్టుల్లో రూట్‌సేన బ్యాటింగ్‌లో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఆ అడ్డంకిని అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో రూట్‌ తర్వాత ఆ స్థాయిలో పరుగులు సాధించిన ఆటగాడు లేకపోవడం.. బ్రిటీష్‌ జట్టును కలవరపెడుతోంది. రూట్‌ సహా బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జాక్ క్రాలే, డోమ్ సిబ్లీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బౌలర్లు ఆశించిన మేర రాణించకపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకుని తప్పు చేశామని.. సారథి రూట్‌ అంగీకరించాడు. నాలుగో టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌లో స్థిరంగా రాణిస్తున్న స్పిన్నర్‌ లీచ్‌కు తోడుగా బెస్‌.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లకు సవాల్‌ విసరనున్నాడు..

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనలే లక్ష్యంగా!

ఈ మ్యాచ్‌లో గెలిచినా లేదా డ్రా చేసుకున్నా టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోతే కోహ్లీసేనకు అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు డ్రా కోసం ఆడుతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. వీటిని మాజీలు ఖండించారు. సారథి కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిలది ఎప్పుడూ గెలుపు కోసమే ఆడే మనస్తత్వమని.. వారు రక్షణాత్మక ఆట ఆడటానికి ఇష్టపడరని మాజీలు అంచనా వేశారు. డ్రా కోసమే ఆడితే అది ఓటమికి దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని ఇంగ్లాండ్‌ ఇప్పటికే కోల్పోయింది. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడితే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది..

ఇవీ చూడండి: అవి పిచ్​లా లేక పంట పొలాలా?.. ఈటీవీ భారత్​తో కర్సన్ ఘర్వీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.