ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లో స్థానం​ కోసం 86 జట్లు!

author img

By

Published : Dec 15, 2020, 5:28 AM IST

ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచకప్​ అర్హత పోటీల్లో 86 దేశాల జట్ల తలపడనున్నాయి. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి మ్యాచ్​లు జరుగుతాయని చెప్పింది.

2022 T20 WC Qualification: 86 teams to fight for 15 spots across 225 matches
టీ20 ప్రపంచకప్​లో స్థానం​ కోసం 86 జట్లు!

2022 ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​నకు అర్హత సాధించేందుకు 86 జట్లు పోటీ పడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) పేర్కొంది. టోర్నీలో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిపింది. 13 నెలల వ్యవధిలో 225 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ సాగుతుందని చెప్పిన ఐసీసీ.. వచ్చే ఏప్రిల్‌ నుంచి మ్యాచ్‌లను జరపనున్నట్లు చెప్పింది. హంగేరి, రొమేనియా, సెర్బియా దేశాలు తొలిసారి టీ20 అర్హత పోటీల్లో పాల్గొననున్నాయి. అర్హత మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లను ప్రపంచ కప్‌నకు ఎంపిక చేస్తారు.

ICC NEWS
ఐసీసీ ప్రధాన కార్యాలయం ఫొటో

ఆతిథ్య దేశంతో పాటు ర్యాంకింగ్‌ దృష్ట్యా 11 జట్లు ఇప్పటికే టోర్నీకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగింటితో కలిపి 16 జట్లు ప్రపంచకప్​లో పోటీపడతాయని ఐసీసీ పేర్కొంది.

2022 ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​నకు అర్హత సాధించేందుకు 86 జట్లు పోటీ పడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) పేర్కొంది. టోర్నీలో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిపింది. 13 నెలల వ్యవధిలో 225 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ సాగుతుందని చెప్పిన ఐసీసీ.. వచ్చే ఏప్రిల్‌ నుంచి మ్యాచ్‌లను జరపనున్నట్లు చెప్పింది. హంగేరి, రొమేనియా, సెర్బియా దేశాలు తొలిసారి టీ20 అర్హత పోటీల్లో పాల్గొననున్నాయి. అర్హత మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లను ప్రపంచ కప్‌నకు ఎంపిక చేస్తారు.

ICC NEWS
ఐసీసీ ప్రధాన కార్యాలయం ఫొటో

ఆతిథ్య దేశంతో పాటు ర్యాంకింగ్‌ దృష్ట్యా 11 జట్లు ఇప్పటికే టోర్నీకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగింటితో కలిపి 16 జట్లు ప్రపంచకప్​లో పోటీపడతాయని ఐసీసీ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.