ETV Bharat / sports

కోహ్లీసేన ఖాతాలో అరుదైన రికార్డు..

author img

By

Published : Nov 25, 2019, 9:21 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన గులాబి బంతి టెస్టులో.. టీమిండియా బ్యాటింగ్​, బౌలింగ్​లో ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్​ కైవసం చేసుకుంది.రెండు టెస్టుల సిరీస్​ను​ 2-0 తేడాతో క్లీన్​స్వీప్​ చేసింది. అతి తక్కువ బంతుల్లో ముగించిన టెస్టుగా చరిత్ర సృష్టించింది.

ఈ ఏడాది ఒక్క టెస్టు మ్యాచ్​ ఓడిపోని కోహ్లీసేన

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్‌ టెస్టులో.. భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల పేస్​ ధాటికి ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను... ఉమేశ్‌ యాదవ్‌ 5, ఇషాంత్‌ 4 వికెట్లు తీసి ముగించారు. అయితే ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో అసలు ఓటమే ఎరగని జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

ఆఖరి టెస్టు ఇదే...

బంగ్లా జట్టు మూడో రోజు ఆటను ప్రారంభించగా... 47 నిముషాల్లోనే మ్యాచ్​ను ముగించేశారు భారత బౌలర్లు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్​ చేసింది కోహ్లీసేన. ఈ టెస్టు విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది భారత జట్టు. వచ్చే నెలలో విండీస్​తో టీ20, వన్డే సిరీస్​లు మాత్రమే ఆడనుంది టీమిండియా.

తక్కువ బంతులు...

భారత గడ్డపై జరిగిన టెస్టుల్లో... అతి తక్కువ బంతుల్లోనే(968) ముగిసిన మ్యాచ్​ ఇదే. 2018లో అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి టెస్టును భారత్​తో ఆడింది. ఈ మ్యాచ్​ 1028 బంతుల్లో పూర్తయింది. అఫ్గాన్​తో మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసినా.. 171.2 ఓవర్లు మ్యాచ్​ జరిగింది. కానీ బంగ్లా ఆట మూడో రోజు వరకు వెళ్లినా.. 161.2 ఓవర్లు మాత్రమే ఆడారు.

పేసర్ల ఆధిపత్యం...

ఈ మ్యాచ్​లో పేసర్లు 19 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండా టెస్టు విజయం సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2018లో జోహన్స్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్​ ఒకటి కాగా.. ప్రస్తుతం కోల్​కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్టు రెండోది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లోనూ టీమిండియా స్పిన్నర్లు వికెట్లేమి తీయలేదు. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సొంతగడ్డపై ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్​లో ఇషాంత్​(9), ఉమేశ్​ యాదవ్​(8), మహ్మద్​ షమీ(2) వికెట్లు సాధించారు. ఇప్పటివరకు పేసర్లు ఎప్పుడూ 19 మందిని ఔట్​ చేయలేదు. 2017లో ఈడెన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లోనే పేస్​ బౌలర్లు తీసిన 17 వికెట్లు ఇప్పటివరకు అత్యధికం.

గెలుపు బాట...

2019లో జరిగిన అన్ని టెస్టులు గెలిచి మరో ఘనత సాధించింది టీమిండియా. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో ఓటమే లేకుండా కొనసాగింది. ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడగా 7 విజయాలు, ఒకటి డ్రా అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన భారత్​ ఆ సిరీస్​ను డ్రా చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్​(2-0), దక్షిణాఫ్రికా(3-0), బంగ్లాదేశ్​(2-0) లపై విజయాలు సాధించింది.

ఇన్నింగ్స్​ తేడాతో...

వరుసగా నాలుగు మ్యాచ్​లు ఇన్నింగ్స్​ తేడాతో గెలిచిన జట్టుగా భారత్​ రికార్డు సృష్టించింది.

  1. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్​ 137 పరుగుల తేడాతో విజయం
  2. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్​ 202 పరుగుల తేడాతో గెలుపు
  3. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా.
  4. ప్రస్తుతం జరిగిన డేనైట్ టెస్టులోనూ ఇన్నింగ్స్​ 46 పరుగుల తేడాతో విజయం.

తొలిసారి డేనైట్ టెస్టు ఆడిన టీమిండియా.. బంగ్లాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్​ 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలో దిగిన టీమిండియా 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో 27వ సెంచరీ నమోదు చేశాడు. పుజారా(55), రహానే(51) అర్ధశతకాలతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్​లో బంగ్లా జట్టు 195 పరుగులకే ఆలౌటైంది.

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్‌ టెస్టులో.. భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల పేస్​ ధాటికి ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను... ఉమేశ్‌ యాదవ్‌ 5, ఇషాంత్‌ 4 వికెట్లు తీసి ముగించారు. అయితే ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో అసలు ఓటమే ఎరగని జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

ఆఖరి టెస్టు ఇదే...

బంగ్లా జట్టు మూడో రోజు ఆటను ప్రారంభించగా... 47 నిముషాల్లోనే మ్యాచ్​ను ముగించేశారు భారత బౌలర్లు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్​ చేసింది కోహ్లీసేన. ఈ టెస్టు విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది భారత జట్టు. వచ్చే నెలలో విండీస్​తో టీ20, వన్డే సిరీస్​లు మాత్రమే ఆడనుంది టీమిండియా.

తక్కువ బంతులు...

భారత గడ్డపై జరిగిన టెస్టుల్లో... అతి తక్కువ బంతుల్లోనే(968) ముగిసిన మ్యాచ్​ ఇదే. 2018లో అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి టెస్టును భారత్​తో ఆడింది. ఈ మ్యాచ్​ 1028 బంతుల్లో పూర్తయింది. అఫ్గాన్​తో మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసినా.. 171.2 ఓవర్లు మ్యాచ్​ జరిగింది. కానీ బంగ్లా ఆట మూడో రోజు వరకు వెళ్లినా.. 161.2 ఓవర్లు మాత్రమే ఆడారు.

పేసర్ల ఆధిపత్యం...

ఈ మ్యాచ్​లో పేసర్లు 19 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండా టెస్టు విజయం సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2018లో జోహన్స్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్​ ఒకటి కాగా.. ప్రస్తుతం కోల్​కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్టు రెండోది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లోనూ టీమిండియా స్పిన్నర్లు వికెట్లేమి తీయలేదు. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సొంతగడ్డపై ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్​లో ఇషాంత్​(9), ఉమేశ్​ యాదవ్​(8), మహ్మద్​ షమీ(2) వికెట్లు సాధించారు. ఇప్పటివరకు పేసర్లు ఎప్పుడూ 19 మందిని ఔట్​ చేయలేదు. 2017లో ఈడెన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లోనే పేస్​ బౌలర్లు తీసిన 17 వికెట్లు ఇప్పటివరకు అత్యధికం.

గెలుపు బాట...

2019లో జరిగిన అన్ని టెస్టులు గెలిచి మరో ఘనత సాధించింది టీమిండియా. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో ఓటమే లేకుండా కొనసాగింది. ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడగా 7 విజయాలు, ఒకటి డ్రా అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన భారత్​ ఆ సిరీస్​ను డ్రా చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్​(2-0), దక్షిణాఫ్రికా(3-0), బంగ్లాదేశ్​(2-0) లపై విజయాలు సాధించింది.

ఇన్నింగ్స్​ తేడాతో...

వరుసగా నాలుగు మ్యాచ్​లు ఇన్నింగ్స్​ తేడాతో గెలిచిన జట్టుగా భారత్​ రికార్డు సృష్టించింది.

  1. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్​ 137 పరుగుల తేడాతో విజయం
  2. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్​ 202 పరుగుల తేడాతో గెలుపు
  3. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా.
  4. ప్రస్తుతం జరిగిన డేనైట్ టెస్టులోనూ ఇన్నింగ్స్​ 46 పరుగుల తేడాతో విజయం.

తొలిసారి డేనైట్ టెస్టు ఆడిన టీమిండియా.. బంగ్లాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్​ 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలో దిగిన టీమిండియా 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో 27వ సెంచరీ నమోదు చేశాడు. పుజారా(55), రహానే(51) అర్ధశతకాలతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్​లో బంగ్లా జట్టు 195 పరుగులకే ఆలౌటైంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 24 November 2019
1. Fans of Flamengo football club in downtown Rio de Janeiro, clapping and shouting "Flamengo", while waiting for Copa Libertadores winning team to return
2. Various of fans gathering near Candelaria church, shouting "Flamengo, oh oh oh!"
3. Fans arriving
4. Wide of fans gathering
5. Fans shouting "Mengao" (as they called their team: Flamengo)
6. Fans lying on giant flag of Flamengo and taking pictures
STORYLINE:
Thousands of supporters gathered in Rio de Janeiro on Sunday to welcome home the Flamengo football team, the new champion of the Copa Libertadores.
Dressed in red and black, the fans of "Mengao" - as the club is better known - carried giant flags, shouted, clapped and celebrated while waiting for the players to return from Peru's capital.
The team produced two last-gasp goals to beat defending champion River Plate 2-1 in Saturday's final.
It's the first time in 38 years that Flamengo won the prestigious Cup.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.