ETV Bharat / sports

ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం - అష్ఫక్​ అహ్మద్

అవినీతికి పాల్పడిన ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై నిషేధం విధించింది ఐసీసీ. 2019 టీ20 ప్రపంచకప్​ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచ్​ల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది.

icc ban, amir hayat
ఐసీసీ బ్యాన్, అమీర్ హయత్
author img

By

Published : Jul 2, 2021, 10:44 AM IST

యూఏఈ క్రికెటర్లు ఆమిర్ హయత్, అష్ఫాక్​ అహ్మద్​లపై అంతర్జాతీయ క్రికెట్​ మండలి ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2019 టీ20 ప్రపంచకప్​ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్​ రౌండ్​ మ్యాచ్​ల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.

భారత్​కు చెందిన మిస్టర్​ 'వై' అనే బుకీ నుంచి డబ్బులు చేతులు మారినట్లు ఐసీసీ నిర్ధరించింది. వీరిద్దరూ రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో వాట్సాప్​ మేసేజ్​లు కూడా నడిచినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో అష్ఫాక్​ అహ్మద్​ బ్యాట్స్​మన్ కాగా, ఆమిర్ హయత్ బౌలర్.

యూఏఈ క్రికెటర్లు ఆమిర్ హయత్, అష్ఫాక్​ అహ్మద్​లపై అంతర్జాతీయ క్రికెట్​ మండలి ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2019 టీ20 ప్రపంచకప్​ సందర్భంగా నిర్వహించిన క్వాలిఫయింగ్​ రౌండ్​ మ్యాచ్​ల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.

భారత్​కు చెందిన మిస్టర్​ 'వై' అనే బుకీ నుంచి డబ్బులు చేతులు మారినట్లు ఐసీసీ నిర్ధరించింది. వీరిద్దరూ రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో వాట్సాప్​ మేసేజ్​లు కూడా నడిచినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో అష్ఫాక్​ అహ్మద్​ బ్యాట్స్​మన్ కాగా, ఆమిర్ హయత్ బౌలర్.

ఇదీ చదవండి: 'ఎలా నవ్వగలుగుతున్నావు బుమ్రా.. బాధగా లేదా'?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.