కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా క్రికెటర్లు కూడా తమ తొలి డోసు వేసుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. తాజాగా మంగళవారం వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. అయితే దీనిపై ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ట్రోల్ చేశాడు.
-
Could have at least worn pants
— Chris Lynn (@lynny50) May 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Could have at least worn pants
— Chris Lynn (@lynny50) May 11, 2021Could have at least worn pants
— Chris Lynn (@lynny50) May 11, 2021
'ఎట్టకేలకు ప్యాంట్ వేసుకున్నావా?' అంటూ కార్తీక్ను ఆటపట్టించాడు లిన్. దినేశ్ కార్తీక్, క్రిస్ లిన్ రెండేళ్ల పాటు కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. 2018 నుంచి కార్తీక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా.. ఇతడి సారథ్యంలో రెండేళ్లు ఆడాడు లిన్. ఆ ఏడాదితో పాటు 2019లోనూ నిరాశపర్చిన లిన్ను వదులుకుంది కేకేఆర్. ప్రస్తుతం ఇతడు ముంబయి ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.