Bumrah Jansen Argument: సొంతగడ్డపై టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్లో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. అయితే.. జోహన్నెస్బర్గ్లో జరిగిన రెండో టెస్టులో భాగంగా భారత పేసర్ బుమ్రా, ప్రొటీస్ బౌలర్ జాన్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లూ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నా ఈ వివాదం తలెత్తడం గమనార్హం. తాజాగా.. దీనిపై స్పందించాడు సౌతాఫ్రికా ఆటగాడు జాన్సన్. సొంత దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని చెప్పుకొచ్చాడు.
"బుమ్రా, నేను ఐపీఎల్లో ఒకే జట్టులో ప్రాతినిధ్యం వహించాం. మేం మంచి మిత్రులం కూడా. కానీ, కొన్నిసార్లు పరిస్థితులు వేరేలా ఉంటాయి. దేశం కోసం ఆడినప్పుడు ఎవ్వరూ తగ్గరు. రెండో టెస్టులో జరిగింది ఇదే. కానీ, దాని గురించి పెద్దగా ఆలోచించను."
--జాన్సన్, దక్షిణాఫ్రికా పేసర్.
రెండో టెస్టులో బుమ్రా క్రీజులో ఉన్నప్పుడు వరుస బౌన్సర్ బంతులతో జాన్సన్ ఇబ్బందిపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అంపైర్ చొరవతో వివాదం చల్లబడింది.
అదే ఊపులో వన్డే సిరీస్..
IND vs SA ODI Series: టెస్టు సిరీస్ గెలిచిన ఊపులోనే భారత్తో వన్డే సిరీస్ కూడా గెలిచేందుకు ప్రయత్నిస్తామని పేసర్ జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, టీమ్ఇండియా మేటి జట్టు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలిపాడు. భారత్ను పూర్తిగా అర్థం చేసుకోవడం విఫలం అవుతున్నట్లు తెలిపాడు. పక్కా ప్రణాళికతో వన్డే సిరీస్ ఆడుతామని పేర్కొన్నాడు.
కాగా, టీమ్ఇండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ బుధవారం(జనవరి 19) ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతున్నాయి.
ఇదీ చదవండి:
IND vs SA: చేజారిన సిరీస్.. బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమా?
100వ టెస్టుకు కెప్టెన్సీ ఆఫర్.. తిరస్కరించిన కోహ్లీ!
టీమ్ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్ అవుట్లే