ETV Bharat / sports

IND VS AUS: భారత్​ తొలి ఇన్నింగ్స్ 400 రన్స్​కు ఆలౌట్​​.. ఆధిక్యం ఎంతంటే?

author img

By

Published : Feb 11, 2023, 11:35 AM IST

Updated : Feb 11, 2023, 12:16 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది.400 భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. దీంతో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు. క్రీజులో మహ్మద్ సిరాజ్​(1*) నాటౌట్​గా నిలిచాడు.

border gavaskar trophy 2023
బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ 2023

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఆసీస్​ చేతులెత్తేసిన పిచ్​పై భారత బ్యాటర్లు విజృంభించారు. 321/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్​లో.. అక్షర్, షమీ దూకుడుగా ఆడటంతో మరో 79 పరుగులు జోడించి.. 400 భారీ స్కోరుతో ఆలౌట్ అయింది. దీంతో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ (120; 212 బంతుల్లో 15x4, 2x6) కెప్టెన్​గా తొలి టెస్టు శతకానికి తోడు.. ఆల్​రౌండర్లు అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) రాణించారు. అక్షర్​ సెంచరీకి చేరువగా వచ్చి దాన్ని మిస్​ అయ్యాడు. ఈ స్కోరుతో అతడు తన టెస్టు కెరీర్​లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇక చివర్లో షమీ (37) దూకుడుగా ఆడాడు.

కాగా, ఆసీస్ బౌలర్లలో యువ స్పిన్నర్ మర్ఫీ చెలరేగాడు. తన మాయాజాలంతో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఔట్​ చేయడం ద్వారా తొలి వికెట్‌ తీసిన మర్ఫీ.. అశ్విన్‌, పుజారా, కోహ్లీ, జడేజా, శ్రీకర్‌ భరత్‌.. ఆఖర్లో షమీని పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్‌లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. ఇంకా పాట్ కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది.

ఇదీ చూడండి: WPL 2023: వేలంలో ఈ ప్లేయర్స్​ వెరీ స్పెషల్​​.. మరి​ కాస్ట్లీగా నిలుస్తారా?

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఆసీస్​ చేతులెత్తేసిన పిచ్​పై భారత బ్యాటర్లు విజృంభించారు. 321/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్​లో.. అక్షర్, షమీ దూకుడుగా ఆడటంతో మరో 79 పరుగులు జోడించి.. 400 భారీ స్కోరుతో ఆలౌట్ అయింది. దీంతో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ (120; 212 బంతుల్లో 15x4, 2x6) కెప్టెన్​గా తొలి టెస్టు శతకానికి తోడు.. ఆల్​రౌండర్లు అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) రాణించారు. అక్షర్​ సెంచరీకి చేరువగా వచ్చి దాన్ని మిస్​ అయ్యాడు. ఈ స్కోరుతో అతడు తన టెస్టు కెరీర్​లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇక చివర్లో షమీ (37) దూకుడుగా ఆడాడు.

కాగా, ఆసీస్ బౌలర్లలో యువ స్పిన్నర్ మర్ఫీ చెలరేగాడు. తన మాయాజాలంతో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఔట్​ చేయడం ద్వారా తొలి వికెట్‌ తీసిన మర్ఫీ.. అశ్విన్‌, పుజారా, కోహ్లీ, జడేజా, శ్రీకర్‌ భరత్‌.. ఆఖర్లో షమీని పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్‌లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. ఇంకా పాట్ కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది.

ఇదీ చూడండి: WPL 2023: వేలంలో ఈ ప్లేయర్స్​ వెరీ స్పెషల్​​.. మరి​ కాస్ట్లీగా నిలుస్తారా?

Last Updated : Feb 11, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.