ETV Bharat / sports

ICC World Cup 2023 : ప్రపంచకప్​ వేదికలపై తుది నిర్ణయం అప్పుడే..

author img

By

Published : May 27, 2023, 5:01 PM IST

Updated : May 27, 2023, 6:51 PM IST

ICC world cup 2023 Venues India : ఈ ఏడాది భారత్​లో జరగనున్న వన్డే ప్రపంచ కప్​ మ్యాచ్​ల వేదికలకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

ICC WC 2023
వన్డే ప్రపంచ కప్​ 2023 వేదికలపై నిర్ణయం

ICC world cup 2023 Venues India : ఈ ఏడాది భారత్​లో జరిగే వన్డే ప్రపంచ కప్​ టోర్నమెంట్​పై బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. వరల్డ్​ కప్​ టోర్నీలో ఏఏ మ్యాచులు ఏఏ వేదికలపై నిర్వహించనున్నారో.. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్​ తర్వాత ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటికే ఈ టోర్నీని 12 వేదికల్లో నిర్వహిస్తామని ప్రకటించింది బీసీసీఐ.

ICC WC 2023 Venues : వన్డే ప్రపంచ కప్​ 2023 టోర్న్​మెంట్​లో మొత్తం 48 మ్యాచ్​లు జరగనున్నాయి. అహ్మదాబాద్​ స్టేడియం సహా హైదరాబాద్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, లఖ్​నవూ, ఇందౌర్, రాజ్​కోట్​, ముంబయి, గువాహటి మైదానాలు వేదికలు కానున్నాయి. భారత్ ఆడే మ్యాచ్​లకు కేవలం ఏడు మైదానాలే వేదిక కానున్నాయి. ఇకపోతే భద్రతా కారణాల దృష్యా పాకిస్థాన్, బంగ్లాదేశ్​ ఆడే మ్యాచ్​లను కొన్ని వేదికలకే పరిమితం చేయనుంది బోర్డు. పాకిస్థాన్​ తమ మ్యాచ్‌లను కోల్‌కతా‌, బెంగళూరు, చెన్నైలో ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను​ కోల్‌కతా, గువాహటిలో ఆడేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది.

గతంలో భారత్ ఆతిథ్యం... ఇది వరకు వన్డే ప్రపంచకప్​నకు భారత్​ మూడు సార్లు ఆతిథ్యమిచ్చింది. అయితే 1987లో పాకిస్థాన్​తో, 1996లో పాక్, శ్రీలంకలతో కలిసి సంయుక్తంగా వేదికను పంచుకుంది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంక​లతో కలసి ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చింది. ఆ సంవత్సరం మహేంద్ర సింగ్​ ధోనీ కెప్టెన్సీలో ఫైనల్​లో శ్రీలంకపై ఉత్కంఠ పోరులో గెలిచి భారత్​ ఛాంపియన్​​గా నిలిచింది. ఆ తర్వాత భారత్ ఆడిన 2015, 2019 ప్రపంచకప్​ల్లో సెమీస్​లోనే నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియాపై ఓడగా.. 2019లో న్యూజిలాండ్​పై పరాజయం పాలైంది.

ఖండించిన బీసీసీఐ.. ఆసియా కప్​ 2023 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదిక) విధానాన్ని బీసీసీఐ ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ.. హైబ్రిడ్ మోడల్​కు అంగీకరించిందంటూ పాకిస్థాన్ మీడియాలో వస్తున్నాయి. అయితే దీనిపై బోర్డు స్పందించింది. ఆ కథనాలను కొట్టిపారేసింది. ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ తర్వాతే.. ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌నకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా టీమ్​ఇండియాను పాకిస్థాన్​కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

'ఆసియా కప్​నకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేము ఐపీఎల్‌ టోర్నమెంట్​తో బిజీగా ఉన్నాము. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుల నుంచి అత్యున్నత స్థాయి ప్రముఖులు ఐపీఎల్‌ ఫైనల్‌ చూసేందుకు భారత్ వస్తున్నారు. వారితో చర్చించి ఆసియా కప్​ పై తుది నిర్ణయం తీసుకుంటాం'.

జై షా బీసీసీఐ కార్యదర్శి.

ICC world cup 2023 Venues India : ఈ ఏడాది భారత్​లో జరిగే వన్డే ప్రపంచ కప్​ టోర్నమెంట్​పై బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. వరల్డ్​ కప్​ టోర్నీలో ఏఏ మ్యాచులు ఏఏ వేదికలపై నిర్వహించనున్నారో.. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్​ తర్వాత ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటికే ఈ టోర్నీని 12 వేదికల్లో నిర్వహిస్తామని ప్రకటించింది బీసీసీఐ.

ICC WC 2023 Venues : వన్డే ప్రపంచ కప్​ 2023 టోర్న్​మెంట్​లో మొత్తం 48 మ్యాచ్​లు జరగనున్నాయి. అహ్మదాబాద్​ స్టేడియం సహా హైదరాబాద్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, లఖ్​నవూ, ఇందౌర్, రాజ్​కోట్​, ముంబయి, గువాహటి మైదానాలు వేదికలు కానున్నాయి. భారత్ ఆడే మ్యాచ్​లకు కేవలం ఏడు మైదానాలే వేదిక కానున్నాయి. ఇకపోతే భద్రతా కారణాల దృష్యా పాకిస్థాన్, బంగ్లాదేశ్​ ఆడే మ్యాచ్​లను కొన్ని వేదికలకే పరిమితం చేయనుంది బోర్డు. పాకిస్థాన్​ తమ మ్యాచ్‌లను కోల్‌కతా‌, బెంగళూరు, చెన్నైలో ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను​ కోల్‌కతా, గువాహటిలో ఆడేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది.

గతంలో భారత్ ఆతిథ్యం... ఇది వరకు వన్డే ప్రపంచకప్​నకు భారత్​ మూడు సార్లు ఆతిథ్యమిచ్చింది. అయితే 1987లో పాకిస్థాన్​తో, 1996లో పాక్, శ్రీలంకలతో కలిసి సంయుక్తంగా వేదికను పంచుకుంది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంక​లతో కలసి ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చింది. ఆ సంవత్సరం మహేంద్ర సింగ్​ ధోనీ కెప్టెన్సీలో ఫైనల్​లో శ్రీలంకపై ఉత్కంఠ పోరులో గెలిచి భారత్​ ఛాంపియన్​​గా నిలిచింది. ఆ తర్వాత భారత్ ఆడిన 2015, 2019 ప్రపంచకప్​ల్లో సెమీస్​లోనే నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియాపై ఓడగా.. 2019లో న్యూజిలాండ్​పై పరాజయం పాలైంది.

ఖండించిన బీసీసీఐ.. ఆసియా కప్​ 2023 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదిక) విధానాన్ని బీసీసీఐ ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ.. హైబ్రిడ్ మోడల్​కు అంగీకరించిందంటూ పాకిస్థాన్ మీడియాలో వస్తున్నాయి. అయితే దీనిపై బోర్డు స్పందించింది. ఆ కథనాలను కొట్టిపారేసింది. ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ తర్వాతే.. ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌నకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా టీమ్​ఇండియాను పాకిస్థాన్​కు పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

'ఆసియా కప్​నకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేము ఐపీఎల్‌ టోర్నమెంట్​తో బిజీగా ఉన్నాము. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుల నుంచి అత్యున్నత స్థాయి ప్రముఖులు ఐపీఎల్‌ ఫైనల్‌ చూసేందుకు భారత్ వస్తున్నారు. వారితో చర్చించి ఆసియా కప్​ పై తుది నిర్ణయం తీసుకుంటాం'.

జై షా బీసీసీఐ కార్యదర్శి.

Last Updated : May 27, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.