ETV Bharat / sports

టెస్ట్‌, వన్డే పగ్గాలు రోహిత్‌కే.. మళ్లీ క్రికెటర్లకు యో-యో టెస్ట్​లు!: బీసీసీఐ

author img

By

Published : Jan 1, 2023, 8:44 PM IST

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకపే లక్ష్యంగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. టీమిండియా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ.. బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. టెస్ట్‌, వన్డేల్లో రోహిత్‌ శర్మ సారథ్యానికి ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చిన బీసీసీఐ.. టీ20 జట్టును మాత్రం హార్దిక్‌ పాండ్య నడిపిస్తాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ వరకు 20 మంది ఆటగాళ్లతో పూల్‌ ఏర్పాటు చేసి వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

bcci latest news about indian cricket team captain
రోహిత్‌ శర్మ

టెస్టు, వన్డేల్లో రోహిత్‌శర్మ కెప్టెన్సీని తొలగిస్తారంటూ చెలరేగుతున్న ఊహగానాలకు బీసీసీఐ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. సాంప్రదాయ ఫార్మట్లలో రోహిత్‌శర్మ సారథ్యంపై బీసీసీఐ భరోసా ఉంచింది. టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ నాయకత్వంపై బీసీసీఐ నమ్మకం ఉంచిందని అధికారి ఒకరు తెలిపారు. టీ20 జట్టును హార్దిక్‌ పాండ్య నడిపిస్తాడని వివరించారు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌ల్లో టీమ్​ఇండియా వైఫల్యంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది.

ముంబయిలో బీసీసీఐ కార్యదర్శి జైషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సారధి రోహిత్, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఎన్​సీఎ అధిపతి వీవీఎస్​ లక్ష్మణ్‌, గత సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్ శర్మ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. టీ20 కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఈ సమావేశానికి హాజరు కాలేదు. శ్రీలంకతో మంగళవారం నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుండడంతో హార్దిక్‌ ఈ భేటీకి రాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు భారత్‌కు అవకాశం ఉండడంతో దీనిపై సమీక్ష సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరో పది నెలల్లోనే 2023 వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుండడంతో దీనిపైనా బీసీసీఐ రోడ్ మ్యాప్‌ ప్రకటించింది. 2023 ప్రపంచకప్ వరకు 20 మంది ఆటగాళ్లతో కూడిన పూల్‌ను పరీక్షించాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలోనే భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో భారత్‌ నిష్క్రమించినప్పటి నుంచి యోయో టెస్ట్‌పై నిర్ణయం పెండింగ్‌లో ఉంది. తాజాగా యోయో టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యోయో పరీక్షతో పాటు బోన్‌ స్కాన్‌ టెస్ట్‌ డెక్సాను కూడా జట్టు ఎంపికలో భాగం చేశారు. టెస్టుల కంటే ఐపీఎల్​లో సంపద కోసం టీ20లకే ప్రాధాన్యం ఇచ్చే వర్దమాన ఆటగాళ్లు.. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే సుదీర్ఘంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని కూడా నిర్ణయించారు.

వర్ధమాన ఆటగాళ్ళు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే గణనీయమైన దేశీయ సీజన్ ఆడాల్సి ఉంటుందని... బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకప్‌ సన్నాహాన దృష్ట్యా ఐపీఎల్​లో పాల్గొనే భారత ఆటగాళ్ల పర్యవేక్షణకు ప్రాంచైజీలతో కలిసి ఎసీఎ పనిచేస్తుందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్‌ రోడ్‌ మ్యాప్‌.. ఆటగాళ్లపై పని భారం, ఫిటెనెస్‌ సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘ సమావేశం జరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

టెస్టు, వన్డేల్లో రోహిత్‌శర్మ కెప్టెన్సీని తొలగిస్తారంటూ చెలరేగుతున్న ఊహగానాలకు బీసీసీఐ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. సాంప్రదాయ ఫార్మట్లలో రోహిత్‌శర్మ సారథ్యంపై బీసీసీఐ భరోసా ఉంచింది. టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ నాయకత్వంపై బీసీసీఐ నమ్మకం ఉంచిందని అధికారి ఒకరు తెలిపారు. టీ20 జట్టును హార్దిక్‌ పాండ్య నడిపిస్తాడని వివరించారు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌ల్లో టీమ్​ఇండియా వైఫల్యంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది.

ముంబయిలో బీసీసీఐ కార్యదర్శి జైషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సారధి రోహిత్, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఎన్​సీఎ అధిపతి వీవీఎస్​ లక్ష్మణ్‌, గత సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్ శర్మ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. టీ20 కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఈ సమావేశానికి హాజరు కాలేదు. శ్రీలంకతో మంగళవారం నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుండడంతో హార్దిక్‌ ఈ భేటీకి రాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు భారత్‌కు అవకాశం ఉండడంతో దీనిపై సమీక్ష సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరో పది నెలల్లోనే 2023 వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుండడంతో దీనిపైనా బీసీసీఐ రోడ్ మ్యాప్‌ ప్రకటించింది. 2023 ప్రపంచకప్ వరకు 20 మంది ఆటగాళ్లతో కూడిన పూల్‌ను పరీక్షించాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలోనే భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో భారత్‌ నిష్క్రమించినప్పటి నుంచి యోయో టెస్ట్‌పై నిర్ణయం పెండింగ్‌లో ఉంది. తాజాగా యోయో టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యోయో పరీక్షతో పాటు బోన్‌ స్కాన్‌ టెస్ట్‌ డెక్సాను కూడా జట్టు ఎంపికలో భాగం చేశారు. టెస్టుల కంటే ఐపీఎల్​లో సంపద కోసం టీ20లకే ప్రాధాన్యం ఇచ్చే వర్దమాన ఆటగాళ్లు.. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే సుదీర్ఘంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని కూడా నిర్ణయించారు.

వర్ధమాన ఆటగాళ్ళు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే గణనీయమైన దేశీయ సీజన్ ఆడాల్సి ఉంటుందని... బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకప్‌ సన్నాహాన దృష్ట్యా ఐపీఎల్​లో పాల్గొనే భారత ఆటగాళ్ల పర్యవేక్షణకు ప్రాంచైజీలతో కలిసి ఎసీఎ పనిచేస్తుందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్‌ రోడ్‌ మ్యాప్‌.. ఆటగాళ్లపై పని భారం, ఫిటెనెస్‌ సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘ సమావేశం జరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.