ETV Bharat / sports

Asia cup 2023 : పాక్​కు షాకివ్వబోతున్న బీసీసీఐ​.. ఆసియా కప్​ ప్లేస్​లో మరో టోర్నీ!

author img

By

Published : May 1, 2023, 2:55 PM IST

Asia Cup 2023 : ఆసియా కప్​ 2023 టోర్నమెంట్‌ నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ టోర్నీ రద్దు అనివార్యమే అన్న కథనాలు వెలువడుతున్నాయి. ఆసియా కప్​ను రద్దు చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని స్థానంలో మరో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

asia cup 2023
asia cup 2023

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఘాటు మాటల యుద్ధం నడుస్తోంది. ప్రపంచ క్రికెట్​లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా.. పాకిస్థాన్​లో ఆడే బదులు వేరే దేశాల్లో ఆడేలా పీసీబీ ప్రతిపాదించింది. ఈ హైబ్రిడ్​ మోడల్​ను మొదట బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆ తర్వాత తిరస్కరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ నిర్వహణపై శ్రీలంక, యూఏఈ ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ పాకిస్థానం మాత్రం.. తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించాలని పట్టుదలతో ఉంది. ఇప్పుడీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని పాక్​ పేర్కొన్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా 2023 వన్డే కప్‌.. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగా ఆసియా కప్​ రద్దైతే.. ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని పీసీబీ ఆలోచనలో పడింది.

కాగా, రెండు వారాల క్రితం ఆసియా కప్​ నిర్వహణకు సంబంధించిన వేదికపై తుది నిర్ణయానికి రావడానికి ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ (ఏసీసీ) సభ్య దేశాలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని.. ఏసీసీ అధ్యక్షుడు జై షా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్​ వేదికపై త్వరలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

ఆసియా కప్​ రద్దు.. బీసీసీఐ సన్నాహాలు..

ఇకపోతే ఆసియా కప్‌ నిర్వహణపై పాకిస్థాన్​ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఓ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్​ రద్దు చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆసియా కప్​ టోర్నీ స్థానంలో ఐదు దేశాల టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే ఆసియా కప్​ నిర్వహించే టైమ్ విండోలో ఈ ప్రతిపాదిత ఐదు దేశాల టోర్నీ ఆడే ఆస్కారముంది. కాగా, గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఘాటు మాటల యుద్ధం నడుస్తోంది. ప్రపంచ క్రికెట్​లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా.. పాకిస్థాన్​లో ఆడే బదులు వేరే దేశాల్లో ఆడేలా పీసీబీ ప్రతిపాదించింది. ఈ హైబ్రిడ్​ మోడల్​ను మొదట బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆ తర్వాత తిరస్కరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ నిర్వహణపై శ్రీలంక, యూఏఈ ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ పాకిస్థానం మాత్రం.. తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించాలని పట్టుదలతో ఉంది. ఇప్పుడీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని పాక్​ పేర్కొన్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా 2023 వన్డే కప్‌.. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగా ఆసియా కప్​ రద్దైతే.. ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని పీసీబీ ఆలోచనలో పడింది.

కాగా, రెండు వారాల క్రితం ఆసియా కప్​ నిర్వహణకు సంబంధించిన వేదికపై తుది నిర్ణయానికి రావడానికి ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ (ఏసీసీ) సభ్య దేశాలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని.. ఏసీసీ అధ్యక్షుడు జై షా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్​ వేదికపై త్వరలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

ఆసియా కప్​ రద్దు.. బీసీసీఐ సన్నాహాలు..

ఇకపోతే ఆసియా కప్‌ నిర్వహణపై పాకిస్థాన్​ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఓ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్​ రద్దు చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆసియా కప్​ టోర్నీ స్థానంలో ఐదు దేశాల టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే ఆసియా కప్​ నిర్వహించే టైమ్ విండోలో ఈ ప్రతిపాదిత ఐదు దేశాల టోర్నీ ఆడే ఆస్కారముంది. కాగా, గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.