ETV Bharat / sports

Ashes 2021: గబ్బాలో తొలి టెస్టు.. ఇంగ్లాండ్​ నెగ్గేనా?

author img

By

Published : Dec 7, 2021, 7:55 PM IST

Ashes 2021: ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ టెస్టు జట్ల మధ్య.. సంప్రదాయ క్రికెట్‌ సమరానికి వేళైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు​ బుధవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలాబలాలేంటో తెలుసుకుందాం.

ashes
యాషెస్

Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్​ సిరీస్​ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో గెలుపు కోసం ఇరు జట్లు ఉరకలేస్తున్నాయి. అయితే.. ఈ ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి టెస్టు గబ్బా వేదికగా జరగనుంది.

ప్యాట్ కమిన్స్​ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు దృఢంగా కనిపిస్తోంది. ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ఈ జట్టులో కీలక ఆటగాడు కానున్నాడు. మరోవైపు టెస్టుకు ఇంగ్లాండ్ కీలక బౌలర్ జిమ్మీ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో​ దూరమవడం కావడం కెప్టెన్ జో రూట్​పై కాస్త ఒత్తిడి పెరిగింది. పైగా.. గబ్బా వేదికగా ఇంగ్లాండ్ ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్​లే గెలవడం కూడా రూట్​పై ఒత్తిడి పెంచే అంశంగా మారింది.

యాషెస్​లో ఇలా..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 71 యాషెస్​ సిరీస్​లు జరిగాయి. అందులో ఆసీస్ జట్టు 33, ఇంగ్లాండ్ 32 విజయాలు సాధించాయి. ఆరు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఈ సారి సిరీస్‌ నెగ్గి ఆస్ట్రేలియాను సమం చేయాలనే పట్టుదలతో రూట్‌ సేన ఉంది. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే మొత్తం 335 టెస్టులు జరగ్గా.. కంగారూ జట్టు 136, ఇంగ్లాండ్‌ 108 చొప్పున గెలిచాయి. 91 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఆస్ట్రేలియా జట్టు: మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, న్యాథన్ లయాన్, జోష్ హేజిల్​వుడ్.

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్(కెప్టెన్), స్టువర్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, హసీద్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్​సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా విజయం నుంచి స్ఫూర్తిపొందుతాం: రూట్

Ashesh 2021: ఇంగ్లాండ్​కు షాక్.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం

యాషెస్​ పిలుస్తోంది.. కదనోత్సాహంతో ఆసీస్-ఇంగ్లాండ్

Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్​ సిరీస్​ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో గెలుపు కోసం ఇరు జట్లు ఉరకలేస్తున్నాయి. అయితే.. ఈ ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి టెస్టు గబ్బా వేదికగా జరగనుంది.

ప్యాట్ కమిన్స్​ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు దృఢంగా కనిపిస్తోంది. ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ఈ జట్టులో కీలక ఆటగాడు కానున్నాడు. మరోవైపు టెస్టుకు ఇంగ్లాండ్ కీలక బౌలర్ జిమ్మీ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో​ దూరమవడం కావడం కెప్టెన్ జో రూట్​పై కాస్త ఒత్తిడి పెరిగింది. పైగా.. గబ్బా వేదికగా ఇంగ్లాండ్ ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్​లే గెలవడం కూడా రూట్​పై ఒత్తిడి పెంచే అంశంగా మారింది.

యాషెస్​లో ఇలా..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 71 యాషెస్​ సిరీస్​లు జరిగాయి. అందులో ఆసీస్ జట్టు 33, ఇంగ్లాండ్ 32 విజయాలు సాధించాయి. ఆరు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఈ సారి సిరీస్‌ నెగ్గి ఆస్ట్రేలియాను సమం చేయాలనే పట్టుదలతో రూట్‌ సేన ఉంది. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే మొత్తం 335 టెస్టులు జరగ్గా.. కంగారూ జట్టు 136, ఇంగ్లాండ్‌ 108 చొప్పున గెలిచాయి. 91 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఆస్ట్రేలియా జట్టు: మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, న్యాథన్ లయాన్, జోష్ హేజిల్​వుడ్.

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్(కెప్టెన్), స్టువర్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, హసీద్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్​సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా విజయం నుంచి స్ఫూర్తిపొందుతాం: రూట్

Ashesh 2021: ఇంగ్లాండ్​కు షాక్.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం

యాషెస్​ పిలుస్తోంది.. కదనోత్సాహంతో ఆసీస్-ఇంగ్లాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.