ETV Bharat / sports

ఫైనల్ మ్యాచ్​కు రావొద్దు - అమితాబ్​కు నెటిజన్లు స్వీట్ వార్నింగ్!

Amitabh Bachchan World Cup Final : 2023 ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 19 జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మమైన మ్యాచ్​కు దేశంలోని సెలెబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ను ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రాకూడదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 5:13 PM IST

Updated : Nov 17, 2023, 5:27 PM IST

amitabh bachchan world cup
amitabh bachchan world cup

Amitabh Bachchan World Cup Final : 2023 వరల్డ్​కప్​ ఫైనల్ మ్యాచ్​ మరో రెండు రోజుల్లో జరగనుంది. తుదిపోరులో భారత్.. ఐదుసార్లు ఛాంపియన్​ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్​ను గ్రాండ్​గా నిర్వహించేందుకు బీసీసీఐ.. భారీగానే ప్లాన్స్ వేస్తోంది. ఈ మ్యాచ్​కు ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోదీ, ఆంటొని ఆల్బనీస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది టీమ్ఇండియా ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావొద్దంటూ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇటీవల జరిగిన సెమీస్​లో భారత్.. న్యూజిలాండ్​ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్​కు దూసుకెళ్లిన సంగంతి తెలిసిందే. అయితే స్టార్ హీరో అమితాబ్.. 'నేను మ్యాచ్ చూడకపోతే.. మనం గెలిచాం' అని సెమీస్ అనంతరం ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. దీంతో సెంటిమెంట్​ ఎక్కువగా ఫాలో అయ్యే టీమ్​ఇండియా ఫ్యాన్స్.. 'ఫైనల్​ మ్యాచ్​కు కూడా రాకండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

'ఒక్కసారికి మ్యాచ్ చూడకండి', 'ఫైనల్‌ మ్యాచ్‌కు మీరు రావొద్దు', 'మీరు మ్యాచ్​కు దూరంగా ఉండండి' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీటికి స్పందించిన అమితాబ్.. 'ఇవన్నీ చూశాక, మ్యాచ్​కు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని సరదాగా మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ పోస్ట్​లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

  • T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !

    — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • T 4831 - when i don't watch we WIN !

    — Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కప్పుమనదే.. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్​.. భారత్ వరల్డ్​కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీసెంట్​గా జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​ను ఆయన ముంబయి వెళ్లి ప్రత్యక్షంగా చూశారు. మ్యాచ్ అనంతరం చెన్నై తిరిగి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈసారి 100 పర్సెంట్ టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుంది' అని అన్నారు.

మ్యాచ్​కు ముందు విన్యాసాలు.. ఫైనల్​ మ్యాచ్​కు ముందు.. భారత్ నేవీకి చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్.. గగనతలంలో విన్యాసాలు చేయనుంది. మ్యాచ్​ ప్రారంభానికి 10 నిమిషాల ముందు.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

'విరాట్ 50 సెంచరీల రికార్డు బాబర్ బ్రేక్ చేస్తాడు!'- కమ్రాన్ అక్మల్

భారత్Xఆస్ట్రేలియా ఫైనల్​ - ఇట్స్ రివెంజ్ టైమ్! - ఆసీస్​ను కొట్టాల్సిందే

Amitabh Bachchan World Cup Final : 2023 వరల్డ్​కప్​ ఫైనల్ మ్యాచ్​ మరో రెండు రోజుల్లో జరగనుంది. తుదిపోరులో భారత్.. ఐదుసార్లు ఛాంపియన్​ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్​ను గ్రాండ్​గా నిర్వహించేందుకు బీసీసీఐ.. భారీగానే ప్లాన్స్ వేస్తోంది. ఈ మ్యాచ్​కు ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోదీ, ఆంటొని ఆల్బనీస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది టీమ్ఇండియా ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావొద్దంటూ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇటీవల జరిగిన సెమీస్​లో భారత్.. న్యూజిలాండ్​ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్​కు దూసుకెళ్లిన సంగంతి తెలిసిందే. అయితే స్టార్ హీరో అమితాబ్.. 'నేను మ్యాచ్ చూడకపోతే.. మనం గెలిచాం' అని సెమీస్ అనంతరం ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. దీంతో సెంటిమెంట్​ ఎక్కువగా ఫాలో అయ్యే టీమ్​ఇండియా ఫ్యాన్స్.. 'ఫైనల్​ మ్యాచ్​కు కూడా రాకండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

'ఒక్కసారికి మ్యాచ్ చూడకండి', 'ఫైనల్‌ మ్యాచ్‌కు మీరు రావొద్దు', 'మీరు మ్యాచ్​కు దూరంగా ఉండండి' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీటికి స్పందించిన అమితాబ్.. 'ఇవన్నీ చూశాక, మ్యాచ్​కు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని సరదాగా మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ పోస్ట్​లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

  • T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !

    — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • T 4831 - when i don't watch we WIN !

    — Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కప్పుమనదే.. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్​.. భారత్ వరల్డ్​కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీసెంట్​గా జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​ను ఆయన ముంబయి వెళ్లి ప్రత్యక్షంగా చూశారు. మ్యాచ్ అనంతరం చెన్నై తిరిగి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈసారి 100 పర్సెంట్ టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుంది' అని అన్నారు.

మ్యాచ్​కు ముందు విన్యాసాలు.. ఫైనల్​ మ్యాచ్​కు ముందు.. భారత్ నేవీకి చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్.. గగనతలంలో విన్యాసాలు చేయనుంది. మ్యాచ్​ ప్రారంభానికి 10 నిమిషాల ముందు.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

'విరాట్ 50 సెంచరీల రికార్డు బాబర్ బ్రేక్ చేస్తాడు!'- కమ్రాన్ అక్మల్

భారత్Xఆస్ట్రేలియా ఫైనల్​ - ఇట్స్ రివెంజ్ టైమ్! - ఆసీస్​ను కొట్టాల్సిందే

Last Updated : Nov 17, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.