ETV Bharat / sports

WTC Final: తుదిపోరులో స్పిన్నర్లే కీలకం - అశ్విన్​, జడేజాలపై ఇయాన్​ బిషప్

డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్​ఇండియా​ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మేలని వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ ఇయాన్​ బిషప్ సూచించాడు. అశ్విన్​, జడేజా అందుకు సరైన ఎంపికని ఆయన అభిప్రాయపడ్డాడు.

WTC final
Ian Bishop on ashwin, jadeja
author img

By

Published : Jun 16, 2021, 10:43 PM IST

న్యూజిలాండ్​తో తలపడనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియాకు సూచించాడు వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ ఇయాన్​ బిషప్. అశ్విన్​, జడేజా అందుకు సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించగలరని చెప్పాడు.

టీమ్​ఇండియాకు స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్​లైతే మేలని నేను భావిస్తాను. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నారు. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించగలరు. బౌలింగ్ లైనప్​లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంటే సమతూకం అవుతుందని భావిస్తున్నా. పేసర్​ బుమ్రా నైపుణ్యం అత్యద్భుతం. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్​​లో సిరాజ్ కూడా మంచి ప్రదర్శనను కనబరిచాడు.

-ఇయాన్​ బిషప్, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్‌​(Ravichandran Aswin) నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా జడేజా(Jadeja) 10 మ్యాచుల్లో 28 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటుతోనూ అద్బుతమైన ప్రదర్శన చేశాడు.

జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన కివీస్​ జట్టు.. ఇప్పుడు టీమ్​ఇండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది.

ఇదీ చదవండి:'సౌథాంప్టన్​ పిచ్ స్పిన్​కే అనుకూలం'

న్యూజిలాండ్​తో తలపడనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియాకు సూచించాడు వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ ఇయాన్​ బిషప్. అశ్విన్​, జడేజా అందుకు సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించగలరని చెప్పాడు.

టీమ్​ఇండియాకు స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్​లైతే మేలని నేను భావిస్తాను. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నారు. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించగలరు. బౌలింగ్ లైనప్​లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంటే సమతూకం అవుతుందని భావిస్తున్నా. పేసర్​ బుమ్రా నైపుణ్యం అత్యద్భుతం. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్​​లో సిరాజ్ కూడా మంచి ప్రదర్శనను కనబరిచాడు.

-ఇయాన్​ బిషప్, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్‌​(Ravichandran Aswin) నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా జడేజా(Jadeja) 10 మ్యాచుల్లో 28 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటుతోనూ అద్బుతమైన ప్రదర్శన చేశాడు.

జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గెలుపొందిన కివీస్​ జట్టు.. ఇప్పుడు టీమ్​ఇండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది.

ఇదీ చదవండి:'సౌథాంప్టన్​ పిచ్ స్పిన్​కే అనుకూలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.