భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, మిచెల్లీ లి(కెనడా) లకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తున్న 'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వీరు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. ఈ గౌరవం తనకు దక్కడంపై సింధు హర్షం వ్యక్తం చేసింది. గతేడాది ఏప్రిల్లో 'ఐ యామ్ బ్యాడ్మింటన్' క్యాంపైన్కు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.
2018లో 'బిలీవ్ ఇన్ స్పోర్ట్స్' క్యాంపైన్ను ప్రారంభించారు. పోటీల్లో జరిగే అవకతవకలు పట్ల అథ్లెట్స్, కోచ్లు సహా ఇతర అధికారులకు దీని ద్వారా అవగాహన కల్పిస్తారు.
ఇదీ చూడండి: 'మన్ కీ బాత్': మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు