సెమీఫైనల్లో సాయి ప్రణీత్ ఓటమితో జపాన్ ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. టోక్యో వేదికగా శనివారం ఉత్కంఠగా జరిగిన పోరులో స్థానిక ఆటగాడు, నెంబర్ వన్ షట్లర్ కెంటో మెమోటో చేతిలో ఓడిపోయాడు ప్రణీత్. తొలి గేమ్లో పోరాడి ఓడిన భారత ఆటగాడు.. రెండో గేమ్లో మాత్రం చేతులెత్తేశాడు. కేవలం 45 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. 18-21, 12-21 తేడాతో చిత్తయ్యాడు.
ఆరంభం బాగానే...
మొదటి రౌండ్ ప్రారంభంలో 3-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు ప్రణీత్ . తర్వాత మెమోటో వరుసగా పాయింట్లు సాధించి లీడ్లోకి వచ్చాడు. రెండో గేమ్లో ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయాడు ప్రణీత్. ఫలితంగా సెమీస్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు తెలుగు తేజం. సాయిని అలవోకగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లాడు నెంబర్వన్ ప్లేయర్. ఇండోనేసియా ఓపెన్లోనూ ఇదే ఆటగాడి చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు ప్రణీత్.
మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో అకానే యమగూచి (ఇండోనేసియా) చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. పురుషుల డబుల్స్లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు భారత ద్వయం సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి.
ఇవీ చూడండి...జపాన్ ఓపెన్: క్వార్టర్స్కే పరిమితమైన సింధు