బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విదేశాల్లోనూ పెరుగుతోంది. ఆయన సినిమాల్లో మరిచిపోలేని చిత్రం "కుచ్కుచ్ హోతా హై". తాజాగా ఈ మూవీలోని "తుమ్ పాస్ ఆయే యూముస్కు రాయే" పాటను ఇండినేషియాకు చెందిన ముగ్గురు అభిమానులు పేరడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Bro who did this? 😂😂😂😂 why am I cringing so hard? Why they be thinking life is a Bollywood movie? pic.twitter.com/nHL1H9hSNc
— Zee (@prestigepls) March 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bro who did this? 😂😂😂😂 why am I cringing so hard? Why they be thinking life is a Bollywood movie? pic.twitter.com/nHL1H9hSNc
— Zee (@prestigepls) March 28, 2019Bro who did this? 😂😂😂😂 why am I cringing so hard? Why they be thinking life is a Bollywood movie? pic.twitter.com/nHL1H9hSNc
— Zee (@prestigepls) March 28, 2019
షారుఖ్, కాజోల్, రాణి ముఖర్జి నటించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ప్రస్తుతం అలాగే అచ్చుగుద్దినట్టు అనుకరించారు ఇండోనేషియా అభిమానులు. విదేశీయులు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్లో ఈ వీడియోను 14లక్షల మంది వీక్షించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్జోహార్ తొలి చిత్రమైన 'కుచ్ కుచ్ హోతా హై' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడుతో సహా 8 విభాగాల్లో ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకుంది. ఆ ఏడాది ప్రేక్షకులను అలరించిన చిత్రంగా జాతీయ పురస్కారాన్నీ కైవసం చేసుకుంది.
భారతీయ చిత్రాలకు ఇండోనేషియాలో ఆదరణ ఎక్కువ. రెండేళ్ల క్రితం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో పాటనూ ఆలపించింది ఇండోనేషియాకు చెందిన ఓ బృందం. 'సాహో రే బాహుబలి' అంటూ పాడుతూ శ్రోతలను ఆకట్టుకుంది.