ETV Bharat / sitara

'అజ్ఞాతవాసి' రీమేక్​లో విద్యుత్​ జమ్వాల్​!

author img

By

Published : May 3, 2021, 11:58 AM IST

పవన్​కల్యాణ్​ 'అజ్ఞాతవాసి' చిత్రం బాలీవుడ్​ రీమేక్​కు సన్నాహాలు జరుగుతున్నాయి. నీరజ్​ పాండే నిర్మాణంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో విలక్షణ నటుడు విద్యుత్​ జమ్వాల్​ ప్రధానపాత్ర పోషించనున్నారని హిందీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.

Vidyut Jammwal to star in the Hindi remake of Pawan Kalyan's 'Agnyaathavaasi'?
'అజ్ఞాతవాసి' హిందీ రీమేక్​లో విద్యుత్​ జమ్వాల్​!

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. టాలీవుడ్​లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. కానీ, హిందీ ఆడియన్స్​ నుంచి ఈ చిత్రానికి అనూహ్యరీతిలో స్పందన వస్తోంది. యూట్యూబ్​లోని ఈ సినిమా హిందీ వర్షన్​కు 100 మిలియన్​ వ్యూస్​ లభించాయి. ఈ నేపథ్యంలో 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్​ విలక్షణ నటుడు విద్యుత్​ జమ్వాల్​ కూడా ఈ కథ ఫిదా అయ్యాడట. దీంతో ఇందులో నటించేందుకు అతను ముందుకొచ్చాడట.

రిలయన్స్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై నీరజ్​ పాండే ఈ రీమేక్​ను తెరకెక్కించనున్నారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అక్షయ్​ కుమార్​ 'రుస్తుం' సినిమా రూపొందించిన టిను సురేశ్​ దేశాయ్​ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అక్కడి నెటివిటీకి తగ్గట్టు కథలో మార్పు చేయనున్నారని సమాచారం.

2018లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రం పవన్​ ఫ్యాన్స్​ను నిరాశకు గురిచేసింది. ఇందులో పవన్​ సరసన కీర్తి సురేశ్​, అను ఇమ్మాన్యుయల్​ నాయికలు నటించారు. ఇందులో ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్​ ఇరానీ, రావు రమేశ్​, మురళీ శర్మ, సంపత్​ రాజ్​, ఇంద్రజ, పవిత్ర లోకేశ్​, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి దేవిశ్రీప్రసాద్​ స్వరాలను సమకూర్చారు.

ఇదీ చూడండి: 'పవన్' హిందీ సినిమాకు 100 మిలియన్​ వ్యూస్

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. టాలీవుడ్​లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. కానీ, హిందీ ఆడియన్స్​ నుంచి ఈ చిత్రానికి అనూహ్యరీతిలో స్పందన వస్తోంది. యూట్యూబ్​లోని ఈ సినిమా హిందీ వర్షన్​కు 100 మిలియన్​ వ్యూస్​ లభించాయి. ఈ నేపథ్యంలో 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్​ విలక్షణ నటుడు విద్యుత్​ జమ్వాల్​ కూడా ఈ కథ ఫిదా అయ్యాడట. దీంతో ఇందులో నటించేందుకు అతను ముందుకొచ్చాడట.

రిలయన్స్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై నీరజ్​ పాండే ఈ రీమేక్​ను తెరకెక్కించనున్నారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అక్షయ్​ కుమార్​ 'రుస్తుం' సినిమా రూపొందించిన టిను సురేశ్​ దేశాయ్​ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అక్కడి నెటివిటీకి తగ్గట్టు కథలో మార్పు చేయనున్నారని సమాచారం.

2018లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రం పవన్​ ఫ్యాన్స్​ను నిరాశకు గురిచేసింది. ఇందులో పవన్​ సరసన కీర్తి సురేశ్​, అను ఇమ్మాన్యుయల్​ నాయికలు నటించారు. ఇందులో ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్​ ఇరానీ, రావు రమేశ్​, మురళీ శర్మ, సంపత్​ రాజ్​, ఇంద్రజ, పవిత్ర లోకేశ్​, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి దేవిశ్రీప్రసాద్​ స్వరాలను సమకూర్చారు.

ఇదీ చూడండి: 'పవన్' హిందీ సినిమాకు 100 మిలియన్​ వ్యూస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.