ETV Bharat / sitara

రియాకు మద్దతుగా విద్య ట్వీట్​.. నెటిజన్లు ట్రోల్స్​

author img

By

Published : Sep 2, 2020, 4:08 PM IST

సుశాంత్​ మృతి కేసులో భాగంగా రియా చక్రవర్తిపై వస్తున్న మీడియా కథనాలను తప్పుబట్టింది బాలీవుడ్​ నటి విద్యాబాలన్​. అయితే, ఈ విషయంపై నెటిజన్లు బాలన్​ను వ్యతిరేకించారు. ట్రోలింగ్​ చేస్తూ ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Vidya Balan
విద్యా బాలన్​

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతికి సంబంధించి రియా చక్రవర్తిపై మీడియాలో వస్తున్న కథనాలపై.. బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ ఇటీవలే విమర్శలు చేసింది​. అయితే, రియాకు మద్దతుగా మాట్లాడటంపై నెటిజన్లు బాలన్​ను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే రకరకాల ట్రోల్స్​తో ట్విట్టర్​ వేదికగా ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా రియాకు మద్దతుగా నిలిచింది. సుశాంత్​, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని కోరింది. లక్ష్మి అభిప్రాయాలను అంగీకరిస్తూ.. విద్యాబాలన్​ రీట్వీట్​ చేసింది. సుశాంత్​ సింగ్​ విషాద ఘటన మీడియా సర్కస్​గా మారడం దురదృష్టకరమని పేర్కొంది విద్య.

  • Interesting to see the feminist card you’re pulling here! Curious as to whr you were the past 2.5 months that ths incident has been dragged on for. It’s ridiculous tht you’d come out in support of someone who’s character assassinating someone she claims she loved and his fam.

    — Sasha Suresh (@ssasjas) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే, 'సుశాంత్​ అనుమానాస్పద​ మృతిపై నోరు విప్పని విద్య.. ఇప్పుడు రియా విషయంలో ఆమె మనసు విరిగిపోయిందా' అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు. 'గత రెండు నెలలుగా మీరు ఎక్కడికి వెళ్లారు' అని మరొకరు విమర్శించారు. ఇలా అనేక మంది విద్యా బాలన్​పై ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి:'సుశాంత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోయింది'

సుశాంత్​ ఆత్మహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతిపై చెలరేగిన వివాదం.. అనేక మంది ప్రముఖులపై విమర్శలకు దారి తీసింది. హిందీ చిత్రసీమలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ సుశాంత్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆలియా భట్​, కరీనా కపూర్​, అనన్య పాండే వంటి బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు.

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతికి సంబంధించి రియా చక్రవర్తిపై మీడియాలో వస్తున్న కథనాలపై.. బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ ఇటీవలే విమర్శలు చేసింది​. అయితే, రియాకు మద్దతుగా మాట్లాడటంపై నెటిజన్లు బాలన్​ను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే రకరకాల ట్రోల్స్​తో ట్విట్టర్​ వేదికగా ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా రియాకు మద్దతుగా నిలిచింది. సుశాంత్​, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని కోరింది. లక్ష్మి అభిప్రాయాలను అంగీకరిస్తూ.. విద్యాబాలన్​ రీట్వీట్​ చేసింది. సుశాంత్​ సింగ్​ విషాద ఘటన మీడియా సర్కస్​గా మారడం దురదృష్టకరమని పేర్కొంది విద్య.

  • Interesting to see the feminist card you’re pulling here! Curious as to whr you were the past 2.5 months that ths incident has been dragged on for. It’s ridiculous tht you’d come out in support of someone who’s character assassinating someone she claims she loved and his fam.

    — Sasha Suresh (@ssasjas) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే, 'సుశాంత్​ అనుమానాస్పద​ మృతిపై నోరు విప్పని విద్య.. ఇప్పుడు రియా విషయంలో ఆమె మనసు విరిగిపోయిందా' అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు. 'గత రెండు నెలలుగా మీరు ఎక్కడికి వెళ్లారు' అని మరొకరు విమర్శించారు. ఇలా అనేక మంది విద్యా బాలన్​పై ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇదీ చూడండి:'సుశాంత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోయింది'

సుశాంత్​ ఆత్మహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతిపై చెలరేగిన వివాదం.. అనేక మంది ప్రముఖులపై విమర్శలకు దారి తీసింది. హిందీ చిత్రసీమలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ సుశాంత్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆలియా భట్​, కరీనా కపూర్​, అనన్య పాండే వంటి బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.