ETV Bharat / sitara

Oscars 2022: బాలీవుడ్​ నటికి ఆస్కార్​ నుంచి ఆహ్వానం

author img

By

Published : Jul 2, 2021, 3:36 PM IST

బాలీవుడ్​ నటి విద్యా బాలన్​తో పాటు నిర్మాతలు ఏక్తా కపూర్​, శోభా కపూర్​లకు అకాడమీ అవార్డ్స్​ (Oscars 2022) సభ్యులుగా చేరేందుకు ఆహ్వానం అందింది. ​ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారు, వచ్చే ఆస్కార్​ అవార్డులు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం దక్కించుకోనున్నారు.

Vidya Balan, Ekta Kapoor, Shobha Kapoor invited to Academy's 'Class of 2021'
Oscars 2022: బాలీవుడ్​ నటికి ఆస్కార్​ నుంచి ఆహ్వానం

అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​(Oscars 2022​)లో సభ్యులుగా చేరాలని ఈ ఏడాదికి గానూ 395 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్​కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్​ నటి విద్యా బాలన్​తో పాటు (Vidya Balan Ekta Kapoor) నిర్మాతలు ఏక్తా కపూర్​, శోభా కపూర్​ ఇందులో ఉన్నారు.

ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది మార్చి 27న జరిగే 94వ ఆస్కార్​ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు బాలీవుడ్​ ప్రముఖులతో పాటు ఆస్కార్​ గ్రహీతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ IIకు కూడా ఈ ఏడాది ఆహ్వానం లభించింది.

Vidya Balan, Ekta Kapoor, Shobha Kapoor invited to Academy's 'Class of 2021'
ఏక్తా కపూర్​, విద్యా బాలన్​

ఎంతమందికి అవకాశం

94వ అకాడమీ అవార్డ్స్​ వేడుకను 2022 మార్చి 27న నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 395 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది 819 మందిని ఓటింగ్​ ప్రక్రియ కోసం పిలవగా.. ఇప్పుడు అందులో దాదాపు సగం మందినే అనుమతించడం గమనార్హం. ఈ ఏడాది అహ్వానం పొందిన వారిలో 46 శాతం మంది మహిళలు, 39 శాతం పురుషులు ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు దాదాపుగా 49 దేశాల(అమెరికా కాకుండా) నుంచి సినీ ప్రముఖులు తరలి రానున్నారు. వీరిలో 89 మంది గతంలో ఆస్కార్​కు నామినేట్​ అవ్వగా.. 25 మంది ఆస్కార్​ గ్రహీతలు ఉన్నారు.

విద్యా బాలన్​.. అనేక ఐకానిక్​ చిత్రాలతో అకాడమీ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో 'కహానీ', 'తుమ్హరీ సులూ' చిత్రాలు నటిగా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత 'పా', 'భూల్​ భులియా', 'పరిణీతా', 'బాబీ జసూస్​', 'ది డర్టీ పిక్చర్​', 'శకుంతలా దేవీ' చిత్రాలతో ప్రపంచస్థాయిలో ఆమె అభిమానులను సంపాదించుకుంది.

ఆస్కార్​లో బాలీవుడ్​ నటులు

గతంలో ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్​ ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ఇర్ఫాన్​ ఖాన్​, అమితాబ్​ బచ్చన్​, ఆమిర్​ ఖాన్​, ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​, సల్మాన్​ ఖాన్​తో పాటు దర్శకనిర్మాతలు గౌతమ్​ గౌస్​, బుద్ధదేబ్​ దాస్​గుప్తా ఉన్నారు.

గతేడాది జరిగిన అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​(ఐఎంపీఏఎస్​)లో సభ్యులుగా 819 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్​కు ఆహ్వానం అందింది. వారిలో బాలీవుడ్​ తారలు ఆలియా భట్​, హృతిక్​ రోషన్​, కాస్ట్యూమ్​ డిజైనర్​ నీతా లుల్లా ఉన్నారు. వీరితో పాటే క్యాస్టింగ్​ డైరెక్టర్​ నందిని శ్రీకాంత్​​, డాక్యుమెంటరీ ఫిల్మ్​మేకర్స్​ నిష్ట జైన్​, షర్లీ అబ్రహం, అమిత్​ మాధేషియా, విజువల్​ ఎఫెక్ట్స్​ సూపర్​వైజర్​ విశాల్​ ఆనంద్​, సందీప్​ కమల్​లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి.. ఆస్కార్​ సభ్యులుగా ఆలియా భట్, హృతిక్ రోషన్​

అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​(Oscars 2022​)లో సభ్యులుగా చేరాలని ఈ ఏడాదికి గానూ 395 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్​కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్​ నటి విద్యా బాలన్​తో పాటు (Vidya Balan Ekta Kapoor) నిర్మాతలు ఏక్తా కపూర్​, శోభా కపూర్​ ఇందులో ఉన్నారు.

ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది మార్చి 27న జరిగే 94వ ఆస్కార్​ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు బాలీవుడ్​ ప్రముఖులతో పాటు ఆస్కార్​ గ్రహీతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ IIకు కూడా ఈ ఏడాది ఆహ్వానం లభించింది.

Vidya Balan, Ekta Kapoor, Shobha Kapoor invited to Academy's 'Class of 2021'
ఏక్తా కపూర్​, విద్యా బాలన్​

ఎంతమందికి అవకాశం

94వ అకాడమీ అవార్డ్స్​ వేడుకను 2022 మార్చి 27న నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 395 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది 819 మందిని ఓటింగ్​ ప్రక్రియ కోసం పిలవగా.. ఇప్పుడు అందులో దాదాపు సగం మందినే అనుమతించడం గమనార్హం. ఈ ఏడాది అహ్వానం పొందిన వారిలో 46 శాతం మంది మహిళలు, 39 శాతం పురుషులు ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు దాదాపుగా 49 దేశాల(అమెరికా కాకుండా) నుంచి సినీ ప్రముఖులు తరలి రానున్నారు. వీరిలో 89 మంది గతంలో ఆస్కార్​కు నామినేట్​ అవ్వగా.. 25 మంది ఆస్కార్​ గ్రహీతలు ఉన్నారు.

విద్యా బాలన్​.. అనేక ఐకానిక్​ చిత్రాలతో అకాడమీ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో 'కహానీ', 'తుమ్హరీ సులూ' చిత్రాలు నటిగా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత 'పా', 'భూల్​ భులియా', 'పరిణీతా', 'బాబీ జసూస్​', 'ది డర్టీ పిక్చర్​', 'శకుంతలా దేవీ' చిత్రాలతో ప్రపంచస్థాయిలో ఆమె అభిమానులను సంపాదించుకుంది.

ఆస్కార్​లో బాలీవుడ్​ నటులు

గతంలో ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్​ ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ఇర్ఫాన్​ ఖాన్​, అమితాబ్​ బచ్చన్​, ఆమిర్​ ఖాన్​, ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​, సల్మాన్​ ఖాన్​తో పాటు దర్శకనిర్మాతలు గౌతమ్​ గౌస్​, బుద్ధదేబ్​ దాస్​గుప్తా ఉన్నారు.

గతేడాది జరిగిన అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​(ఐఎంపీఏఎస్​)లో సభ్యులుగా 819 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్​కు ఆహ్వానం అందింది. వారిలో బాలీవుడ్​ తారలు ఆలియా భట్​, హృతిక్​ రోషన్​, కాస్ట్యూమ్​ డిజైనర్​ నీతా లుల్లా ఉన్నారు. వీరితో పాటే క్యాస్టింగ్​ డైరెక్టర్​ నందిని శ్రీకాంత్​​, డాక్యుమెంటరీ ఫిల్మ్​మేకర్స్​ నిష్ట జైన్​, షర్లీ అబ్రహం, అమిత్​ మాధేషియా, విజువల్​ ఎఫెక్ట్స్​ సూపర్​వైజర్​ విశాల్​ ఆనంద్​, సందీప్​ కమల్​లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి.. ఆస్కార్​ సభ్యులుగా ఆలియా భట్, హృతిక్ రోషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.