ETV Bharat / sitara

'ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డమే క‌ష్ట‌మైంది'

author img

By

Published : Dec 9, 2019, 10:39 PM IST

'వెంకీమామ' విడుదల నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నారు నిర్మాత సురేశ్​బాబు. ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న కథల పరిస్థితి గురించి వివరించారు. తన దగ్గరున్న కథలకు దర్శకులను వెతకడం కష్టమైందని అన్నారు.

'ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డమే క‌ష్ట‌మైంది'
నిర్మాత సురేశ్​బాబు-వెంకీమామ సినిమా

తెలుగు చిత్రసీమలో కథల కొరత ఉందని ఎవరైనా అంటే నిర్మాత సురేశ్​బాబుకు నచ్చదేమో. ఎందుకంటే ఆయన దగ్గర బోలెడు కథలున్నాయి. కానీ వాటికి దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమవుతుందని అన్నారు. సొంత వాటినే కాకుండా పొరుగు భాషల్లోని కథలను రీమేక్ చేస్తుంటారు. అలా ఆయన దగ్గర ఇప్పటికే చాలా కథలు పోగయ్యాయి. సురేశ్​బాబు ప్రస్తుతం నిర్మించిన 'వెంకీమామ' ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.

suresh babu-vivek kuchibotla
వెంకీమామ నిర్మాతలు వివేక్ కూచిభొట్ల-సురేశ్​బాబు

విడుదల తేదీలో గందరగోళం అందుకే

నా కెరీర్‌లో తొలిసారి విడుద‌ల విష‌యంలో గంద‌ర‌గోళానికి గుర‌య్యా. చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత 'వెంకీమామ‌'ను ఈ నెల 13న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. మొద‌ట ద‌స‌రాకే తీసుకురావాలనుకున్నాం. కానీ నా జీవితంలో గ‌తేడాది చాలా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందుకే రెండు నెల‌ల‌పాటు అమెరికాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా ద‌స‌రాకే తెద్దామని ప్ర‌య‌త్నించాం కానీ, వెంక‌టేశ్ కాలికి గాయ‌మైంది. ఆ త‌ర్వాత దీపావ‌ళికి అనుకున్నాం. రాశీఖ‌న్నా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డం వల్ల మిగిలిన ఒక్క పాట‌ను షూట్ చేయలేకపోయాం. అలా దీపావ‌ళికి కూడా రాలేక‌పోయాం. ఈ కారణంతో సంక్రాంతికి విడుద‌ల అనే పుకారొచ్చింది. అయితే మేం ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే మూడు సినిమాల రిలీజ్​ డేట్స్ ఖ‌రార‌య్యాయి. మేం అప్పుడు రావ‌డం భావ్యం కాదు. పైగా వెంక‌టేశ్​కు అంద‌రితో మంచి అనుబంధం ఉంది. అందుకే క్రిస్​మ‌స్ క‌లిసొస్తుంద‌ని ఈ నెల 13న విడుద‌ల తేదీగా నిర్ణయించాం. మ‌హిళ‌ల‌కు న‌చ్చే అంశాలున్నాయి కాబ‌ట్టి, నా థియేట‌ర్ల‌లో సంక్రాంతి వ‌ర‌కూ ఈ సినిమా ఆడుతుంద‌నే భ‌రోసా ఉంది

అన్ని ఉంటాయి ఈ సినిమాలో

వెంక‌టేష్ 'ఎఫ్‌2' చేయ‌డం కంటే ముందే ఈ క‌థ మా ద‌గ్గ‌ర ఉంది. జనార్ధ‌న మ‌హ‌ర్షి చెప్పిన ఈ క‌థ‌ను, వివేక్ కూచిభొట్ల మొద‌ట మా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. క‌థ న‌చ్చింది కానీ, చాలా మెరుగులు దిద్దాలనిపించింది. అప్పుడు కోన‌ను పిలిచి ఈ క‌థ వినిపించి ఏమైనా మార్చ‌గ‌ల‌మా అని అడిగా. మార్చొచ్చు అని చెప్పి ద‌ర్శ‌కుడు బాబీని ప‌రిచ‌యం చేశాడు. బాబీతో పాటు అతడి బృందం క‌లిసి ఈ క‌థ‌ను కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో క‌లిపి స్క్రిప్టు చేశారు. ఆ సీక్వెన్స్ గురించి చెప్ప‌గానే నాకు క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పుడైనా సినిమాను ఒక టెంప్లేట్ ప్ర‌కారం చేస్తుంటాను. ఆ ప్ర‌కారం నాకున్న సందేహాల‌న్నింటినీ బాబీ ముందు పెట్టా. వాట‌న్నిటికీ పరిష్కారం వెదుక్కుంటూ ఈ సినిమాను పూర్తి చేశాడు. భావోద్వేగాలు, విలువ‌లు, మంచి హాస్యం, కుటుంబ అంశాలు... అన్ని మేళ‌వించిన చిత్ర‌మిది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూశాక మ‌నం కూడా ఇలా ఉండాలి, ఇలాంటి విష‌యాల్ని అనుస‌రించాల‌ని ఒక నిర్ణ‌యానికొస్తారు.

venkatesh-naga chaitanya
వెంకీమామ సినిమాలో వెంకటేశ్-నాగచైతన్య

అలా చేస్తే ఎక్కువగా రోజులు ఆడతాయి

ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమాను అందించాలి. కొన్ని ఊళ్ల‌లో ఒక‌ట్రెండు థియేట‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. వాటిలో ప్ర‌ద‌ర్శ‌న మ‌ల్టీప్లెక్స్‌ల త‌ర‌హాలో ఉండాలి. రోజుకి మొత్తం ప‌ది షోలు ప‌డ‌తాయంటే అందులో మూడు నాలుగు సినిమాల్ని ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దాంతో అన్ని ర‌కాల సినిమాలు ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తాయి. పైగా ఒక్కొక్క‌ సినిమా ఇదివ‌ర‌క‌టిలాగా ఎక్కువ రోజులు ఆడే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే, తాను అనుకున్న సినిమా థియేట‌ర్‌లో లేదంటే ప్రేక్ష‌కుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటాడు. డిజిట‌ల్ మాధ్య‌మాలు, పైర‌సీల్ని ఆశ్ర‌యిస్తాడు. అందుకే మ‌నం సినిమాను ప్రేక్ష‌కుల ముందు స‌మ‌ర్థ‌మంతంగా తీసుకెళ్లాలి.

naga chaitanya-raashi khanna
వెంకీమామ సినిమాలో నాగచైతన్య-రాశీఖన్నా

దర్శకుల్ని ఎంపిక చేయడం కష్టంగా ఉంది

క‌థ‌లు చాలా ముఖ్యం. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోలంటే ఖాన్ త్ర‌య‌మే. కానీ ఇప్పుడ‌క్క‌డ ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌ కుమార్ రావు వంటి హీరోల సినిమాలు కూడా వంద‌ల కోట్లు వ‌సూళ్లు చేస్తున్నాయి. అక్ష‌య్‌కుమార్ అన్ని ర‌కాల క‌థ‌లు చేస్తున్నాడు. వాళ్ల శైలిలో క‌థా బ‌ల‌మున్న చిత్రాలు చేయాలి. అప్పుడు అన్ని సినిమాల్ని, అంద‌రి సినిమాల్నీ చూడ‌టానికి ప్రేక్ష‌కుడు ఆస‌క్తి చూపుతాడు. తెలుగులోనూ హీరోలు అలా మారే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంది. డిజిట‌ల్ మాధ్య‌మాల వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచ‌న లేదు. నా ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల‌కు ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డ‌మే ఇప్పుడు క‌ష్టంగా మారింది.

అందుకోసమే శ్రమిస్తున్నాం

హాలీవుడ్‌లో ఒకొక్క క‌థ కోసం రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ చాలా ముఖ్యం. ఇక్క‌డ క‌థ‌లు బాగానే ఉంటాయి. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని.. మ‌రిన్ని మెరుగులు దిద్ద‌మ‌ని చెబుతుంటాం. సినిమా తీసే విధానం ఉత్త‌మంగా ఉండాలి. అప్పుడు అనుకున్న ఫ‌లితాలొస్తాయి. 'హిర‌ణ్య‌' కోసం మూడేళ్లుగా మా బృందం క‌ష్ట‌ప‌డుతోంది. అత్యుత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమా తీయాల‌నేదే మా క‌స‌రత్తంతా. అందుకోస‌మే శ్ర‌మిస్తున్నాం. వెంక‌టేశ్​ కోసం త‌రుణ్ భాస్క‌ర్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడు. త్రినాథ‌రావు న‌క్కిన.. ఇంత‌కుముందు అనుకున్న క‌థ కాకుండా, మ‌రొక‌టి సిద్ధం చేస్తున్నాడు.

దాసరి తరహాలో నాయకుడు కావాలి

ఎప్ప‌ట్నుంచో సినిమాలు తీస్తున్నాం కానీ, మ‌న విధానం మాత్రం ఇంకా మార‌లేదు. బాలీవుడ్ యాభై శాతం మారింది. అక్క‌డ కొన్ని సంస్థ‌లు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా సినిమాను తీస్తున్నాయి. ఇక్క‌డ నిర్మాత‌లకు త‌ప్పులు క‌నిపిస్తున్నా, వాటిని అలానే చేయ‌నిస్తున్నారు. దాంతో అన్ని విభాగాల్లోనూ ఎఫిషియ‌న్సీ లోపించింది. దానివ‌ల్లే స‌మ‌స్య‌లు. అంద‌రూ స‌మ‌ర్థ‌త‌తో ప‌నిచేస్తే ప‌రిశ్ర‌మ క‌చ్చితంగా మంచి దారిలో ప‌య‌నిస్తుంది. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర‌హాలో మ‌న ప‌రిశ్ర‌మ‌కి ఒక నాయ‌కుడు అవ‌స‌రం నిజంగానే ఉంది. నాలాంటివాళ్లు ఆ బాధ్య‌త‌ను తీసుకుంటే స్వార్థం కోణాల్ని వెదుకుతారేమో అనిపిస్తుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలుగు చిత్రసీమలో కథల కొరత ఉందని ఎవరైనా అంటే నిర్మాత సురేశ్​బాబుకు నచ్చదేమో. ఎందుకంటే ఆయన దగ్గర బోలెడు కథలున్నాయి. కానీ వాటికి దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమవుతుందని అన్నారు. సొంత వాటినే కాకుండా పొరుగు భాషల్లోని కథలను రీమేక్ చేస్తుంటారు. అలా ఆయన దగ్గర ఇప్పటికే చాలా కథలు పోగయ్యాయి. సురేశ్​బాబు ప్రస్తుతం నిర్మించిన 'వెంకీమామ' ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.

suresh babu-vivek kuchibotla
వెంకీమామ నిర్మాతలు వివేక్ కూచిభొట్ల-సురేశ్​బాబు

విడుదల తేదీలో గందరగోళం అందుకే

నా కెరీర్‌లో తొలిసారి విడుద‌ల విష‌యంలో గంద‌ర‌గోళానికి గుర‌య్యా. చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత 'వెంకీమామ‌'ను ఈ నెల 13న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. మొద‌ట ద‌స‌రాకే తీసుకురావాలనుకున్నాం. కానీ నా జీవితంలో గ‌తేడాది చాలా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందుకే రెండు నెల‌ల‌పాటు అమెరికాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా ద‌స‌రాకే తెద్దామని ప్ర‌య‌త్నించాం కానీ, వెంక‌టేశ్ కాలికి గాయ‌మైంది. ఆ త‌ర్వాత దీపావ‌ళికి అనుకున్నాం. రాశీఖ‌న్నా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డం వల్ల మిగిలిన ఒక్క పాట‌ను షూట్ చేయలేకపోయాం. అలా దీపావ‌ళికి కూడా రాలేక‌పోయాం. ఈ కారణంతో సంక్రాంతికి విడుద‌ల అనే పుకారొచ్చింది. అయితే మేం ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికే మూడు సినిమాల రిలీజ్​ డేట్స్ ఖ‌రార‌య్యాయి. మేం అప్పుడు రావ‌డం భావ్యం కాదు. పైగా వెంక‌టేశ్​కు అంద‌రితో మంచి అనుబంధం ఉంది. అందుకే క్రిస్​మ‌స్ క‌లిసొస్తుంద‌ని ఈ నెల 13న విడుద‌ల తేదీగా నిర్ణయించాం. మ‌హిళ‌ల‌కు న‌చ్చే అంశాలున్నాయి కాబ‌ట్టి, నా థియేట‌ర్ల‌లో సంక్రాంతి వ‌ర‌కూ ఈ సినిమా ఆడుతుంద‌నే భ‌రోసా ఉంది

అన్ని ఉంటాయి ఈ సినిమాలో

వెంక‌టేష్ 'ఎఫ్‌2' చేయ‌డం కంటే ముందే ఈ క‌థ మా ద‌గ్గ‌ర ఉంది. జనార్ధ‌న మ‌హ‌ర్షి చెప్పిన ఈ క‌థ‌ను, వివేక్ కూచిభొట్ల మొద‌ట మా ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. క‌థ న‌చ్చింది కానీ, చాలా మెరుగులు దిద్దాలనిపించింది. అప్పుడు కోన‌ను పిలిచి ఈ క‌థ వినిపించి ఏమైనా మార్చ‌గ‌ల‌మా అని అడిగా. మార్చొచ్చు అని చెప్పి ద‌ర్శ‌కుడు బాబీని ప‌రిచ‌యం చేశాడు. బాబీతో పాటు అతడి బృందం క‌లిసి ఈ క‌థ‌ను కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో క‌లిపి స్క్రిప్టు చేశారు. ఆ సీక్వెన్స్ గురించి చెప్ప‌గానే నాకు క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పుడైనా సినిమాను ఒక టెంప్లేట్ ప్ర‌కారం చేస్తుంటాను. ఆ ప్ర‌కారం నాకున్న సందేహాల‌న్నింటినీ బాబీ ముందు పెట్టా. వాట‌న్నిటికీ పరిష్కారం వెదుక్కుంటూ ఈ సినిమాను పూర్తి చేశాడు. భావోద్వేగాలు, విలువ‌లు, మంచి హాస్యం, కుటుంబ అంశాలు... అన్ని మేళ‌వించిన చిత్ర‌మిది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూశాక మ‌నం కూడా ఇలా ఉండాలి, ఇలాంటి విష‌యాల్ని అనుస‌రించాల‌ని ఒక నిర్ణ‌యానికొస్తారు.

venkatesh-naga chaitanya
వెంకీమామ సినిమాలో వెంకటేశ్-నాగచైతన్య

అలా చేస్తే ఎక్కువగా రోజులు ఆడతాయి

ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమాను అందించాలి. కొన్ని ఊళ్ల‌లో ఒక‌ట్రెండు థియేట‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. వాటిలో ప్ర‌ద‌ర్శ‌న మ‌ల్టీప్లెక్స్‌ల త‌ర‌హాలో ఉండాలి. రోజుకి మొత్తం ప‌ది షోలు ప‌డ‌తాయంటే అందులో మూడు నాలుగు సినిమాల్ని ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దాంతో అన్ని ర‌కాల సినిమాలు ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తాయి. పైగా ఒక్కొక్క‌ సినిమా ఇదివ‌ర‌క‌టిలాగా ఎక్కువ రోజులు ఆడే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే, తాను అనుకున్న సినిమా థియేట‌ర్‌లో లేదంటే ప్రేక్ష‌కుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటాడు. డిజిట‌ల్ మాధ్య‌మాలు, పైర‌సీల్ని ఆశ్ర‌యిస్తాడు. అందుకే మ‌నం సినిమాను ప్రేక్ష‌కుల ముందు స‌మ‌ర్థ‌మంతంగా తీసుకెళ్లాలి.

naga chaitanya-raashi khanna
వెంకీమామ సినిమాలో నాగచైతన్య-రాశీఖన్నా

దర్శకుల్ని ఎంపిక చేయడం కష్టంగా ఉంది

క‌థ‌లు చాలా ముఖ్యం. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోలంటే ఖాన్ త్ర‌య‌మే. కానీ ఇప్పుడ‌క్క‌డ ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌ కుమార్ రావు వంటి హీరోల సినిమాలు కూడా వంద‌ల కోట్లు వ‌సూళ్లు చేస్తున్నాయి. అక్ష‌య్‌కుమార్ అన్ని ర‌కాల క‌థ‌లు చేస్తున్నాడు. వాళ్ల శైలిలో క‌థా బ‌ల‌మున్న చిత్రాలు చేయాలి. అప్పుడు అన్ని సినిమాల్ని, అంద‌రి సినిమాల్నీ చూడ‌టానికి ప్రేక్ష‌కుడు ఆస‌క్తి చూపుతాడు. తెలుగులోనూ హీరోలు అలా మారే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంది. డిజిట‌ల్ మాధ్య‌మాల వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచ‌న లేదు. నా ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల‌కు ద‌ర్శ‌కుల్ని ఎంపిక చేయ‌డ‌మే ఇప్పుడు క‌ష్టంగా మారింది.

అందుకోసమే శ్రమిస్తున్నాం

హాలీవుడ్‌లో ఒకొక్క క‌థ కోసం రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ చాలా ముఖ్యం. ఇక్క‌డ క‌థ‌లు బాగానే ఉంటాయి. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని.. మ‌రిన్ని మెరుగులు దిద్ద‌మ‌ని చెబుతుంటాం. సినిమా తీసే విధానం ఉత్త‌మంగా ఉండాలి. అప్పుడు అనుకున్న ఫ‌లితాలొస్తాయి. 'హిర‌ణ్య‌' కోసం మూడేళ్లుగా మా బృందం క‌ష్ట‌ప‌డుతోంది. అత్యుత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమా తీయాల‌నేదే మా క‌స‌రత్తంతా. అందుకోస‌మే శ్ర‌మిస్తున్నాం. వెంక‌టేశ్​ కోసం త‌రుణ్ భాస్క‌ర్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడు. త్రినాథ‌రావు న‌క్కిన.. ఇంత‌కుముందు అనుకున్న క‌థ కాకుండా, మ‌రొక‌టి సిద్ధం చేస్తున్నాడు.

దాసరి తరహాలో నాయకుడు కావాలి

ఎప్ప‌ట్నుంచో సినిమాలు తీస్తున్నాం కానీ, మ‌న విధానం మాత్రం ఇంకా మార‌లేదు. బాలీవుడ్ యాభై శాతం మారింది. అక్క‌డ కొన్ని సంస్థ‌లు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా సినిమాను తీస్తున్నాయి. ఇక్క‌డ నిర్మాత‌లకు త‌ప్పులు క‌నిపిస్తున్నా, వాటిని అలానే చేయ‌నిస్తున్నారు. దాంతో అన్ని విభాగాల్లోనూ ఎఫిషియ‌న్సీ లోపించింది. దానివ‌ల్లే స‌మ‌స్య‌లు. అంద‌రూ స‌మ‌ర్థ‌త‌తో ప‌నిచేస్తే ప‌రిశ్ర‌మ క‌చ్చితంగా మంచి దారిలో ప‌య‌నిస్తుంది. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర‌హాలో మ‌న ప‌రిశ్ర‌మ‌కి ఒక నాయ‌కుడు అవ‌స‌రం నిజంగానే ఉంది. నాలాంటివాళ్లు ఆ బాధ్య‌త‌ను తీసుకుంటే స్వార్థం కోణాల్ని వెదుకుతారేమో అనిపిస్తుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Madrid, 9 December 2019
1. Tilt down to stage at COP 25 event
2. Close of COP 25 logo
3. Mid of audience
4. Michele Bachelet, UN High Commissioner for Human Rights, approaching podium
5. SOUNDBITE (English) Michele Bachelet, UN High Commissioner for Human Rights:
"All of us can see climate change is already underway destroying lives, vital infrastructures, and ecosystems. No country, no economy and no community will be spared from the impact. There is no room for denial or 'business as usual', in the face of these facts; our world, our lives and your future is at stake. Children and young people including young people under the age of 18 have a right to participate in decision making. The Convention on the Rights of the Child demands this, the Paris agreement reaffirms it, and I'm glad to see young people asserting this right in classrooms and on the street, at the United Nations, and in parliament, to demand more effective climate action.”
6. Pan of young activists taking seats on stage
7. Cutaway photographers
8. SOUNDBITE (English) Theo (no surname available), 17-year old activist from Ireland:
“You have promised much and have delivered very little. Today people are dying, children are dying. If you were to ask me to sum up everything that is wrong with the climate crisis, I think I would say that - children are dying. So today we are asking you, please listen to us, please listen to the science, please sign the declaration on climate youth and children."
9. Sign reading "#timeforaction"
10. Wide of event
STORYLINE
The UN High Commissioner for Human Rights, Michele Bachelet, joined young activists in calling for governments to step up their efforts against climate change on Monday.
Speaking at an event with young activists at the COP25 climate conference in Madrid, Bachelet said it was time to listen to children and young people affected by climate change.
She highlighted the role of youth activism in calling on leaders to act.
The event also marked the launch of the Intergovernmental Declaration on Children, Youth and Climate Action.
The declaration calls on governments to take urgent action to protect children and young people from the climate crisis and to include them in decision-making with regards to climate change.
"Children are dying. So today we are asking you, please listen to us, please listen to the science," a young activist from Ireland told the audience.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.