చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్.. 'అర్జున్రెడ్డి' రీమేక్ 'ఆదిత్య వర్మ'తో అరంగేట్రం చేశాడు. అంతకు ముందు ధ్రువ్ హీరోగా తీసిన 'వర్మ'.. అక్టోబరు 6న ఓటీటీలో విడుదల కానుంది.
ఇంతకీ ఏం జరిగింది?
తొలుత ఈ రీమేక్ను ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించారు. అవుట్పుట్ సరిగ్గా రాలేదనే కారణం వల్ల నిర్మాణ సంస్థకు, ఈయనకు మధ్య వివాదం జరిగింది. దీంతో మాతృకను తీసిన సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య సీన్లోకి ఎంటరయ్యారు. ఇదే రీమేక్ను ధ్రువ్ హీరోగా 'ఆదిత్య వర్మ'గా తీశారు. అదే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాలా వెర్షన్ అలానే ఉండిపోయింది.
ఇప్పుడు లాక్డౌన్ ప్రభావంతో అందరూ ఓటీటీలనే ఆశ్రయిస్తున్న తరుణంలో మొదటి వెర్షన్ను విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అక్టోబరు 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది 'వర్మ'.
ఇది చదవండి: ఒక్క సినిమాతోనే సినీ కెరీర్కు ధ్రువ్ విక్రమ్ పుల్స్టాప్!