ETV Bharat / sitara

రెమ్యునరేషన్ పెంచేసిన మాటల మాంత్రికుడు!

author img

By

Published : Aug 6, 2020, 6:12 AM IST

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ ఏడాది విడుదలైన 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్​తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

రెమ్యునరేషన్ పెంచేసిన మాటల మాంత్రికుడు!
రెమ్యునరేషన్ పెంచేసిన మాటల మాంత్రికుడు!

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దక్కించుకుంది. ఈ సినిమా అటు అల్లు అర్జున్​, ఇటు త్రివిక్రమ్ కెరీర్​లో బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. తాజాగా ఈ మాటల మాంత్రికుడు జూనియర్ ఎన్టీఆర్​తో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్​ను పెంచినట్లు సమాచారం.

ఎన్టీఆర్​తో తీయబోయే చిత్రం కోసం త్రివిక్రమ్ భారీగా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఏకంగా 20 కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకుముందు 10-15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు త్రివిక్రమ్.

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దక్కించుకుంది. ఈ సినిమా అటు అల్లు అర్జున్​, ఇటు త్రివిక్రమ్ కెరీర్​లో బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. తాజాగా ఈ మాటల మాంత్రికుడు జూనియర్ ఎన్టీఆర్​తో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్​ను పెంచినట్లు సమాచారం.

ఎన్టీఆర్​తో తీయబోయే చిత్రం కోసం త్రివిక్రమ్ భారీగా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఏకంగా 20 కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకుముందు 10-15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు త్రివిక్రమ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.