ETV Bharat / sitara

పాన్​ ఇండియా సినిమాతో మనోజ్​ రీఎంట్రీ

author img

By

Published : Feb 13, 2020, 1:02 PM IST

Updated : Mar 1, 2020, 5:07 AM IST

టాలీవుడ్​ హీరో మంచు మనోజ్​ కొంత కాలం విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. బహుభాషా చిత్రం ద్వారా వెండితెరపై కనువిందు చేయనున్నట్లు ఈరోజు ప్రకటించాడు. ఈ సినిమాకు 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్​ పెట్టినట్లు వెల్లడించాడు.

Tollywood Actor Manchu Manoj Back To Action With A Pan-India Film with title Aham Brahmasmi
గ్యాప్​ ఇచ్చినా పాన్​ ఇండియా సినిమాతో మనోజ్​ రీఎంట్రీ

మూడేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నాడు హీరో మంచు మనోజ్​. ఇటీవలే ఎంఎం ఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ నటుడు... తన బ్యానర్​లోనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు టైటిల్​ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు.

Aham Brahmasmi
అహం బ్రహ్మాస్మి పోస్టర్​

'అహం బ్రహ్మాస్మి' పేరుతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మనోజ్​, తన తల్లి నిర్మలాదేవి నిర్మించనున్నారు. మార్చి 6న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

మూడేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నాడు హీరో మంచు మనోజ్​. ఇటీవలే ఎంఎం ఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ నటుడు... తన బ్యానర్​లోనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు టైటిల్​ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు.

Aham Brahmasmi
అహం బ్రహ్మాస్మి పోస్టర్​

'అహం బ్రహ్మాస్మి' పేరుతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మనోజ్​, తన తల్లి నిర్మలాదేవి నిర్మించనున్నారు. మార్చి 6న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

Last Updated : Mar 1, 2020, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.