టాలీవుడ్ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.
యమకింకరుడు, ఆణిముత్యం ,భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి విజయవంతమైన చిత్రాలకు చంద్రశేఖర్ సంగీతమందించారు. ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈయన దగ్గరే శిష్యరికం చేశారు.