ETV Bharat / sitara

Taapsee Pannu: ఓటీటీలో రష్మీ రాకెట్!

author img

By

Published : Jun 2, 2021, 8:19 AM IST

తాప్సీ (Taapsee Pannu) నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'రష్మీ రాకెట్' (Rashmi Rocket). కరోనా నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం.

rashmi rocket
రష్మీ రాకెట్

తాప్సీ (Taapsee Pannu) నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'రష్మీ రాకెట్‌' (Rashmi Rocket). ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో కొంతకాలంగా కాస్త ఆసక్తి నెలకొంది.

కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్‌ విడుదల కోసం మరికొంత కాలం ఎదురుచూస్తుందా అని చర్చలు సాగాయి. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు పలు ఓటీటీ వేదికలతో చర్చలు కూడా జరుపుతున్నారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

జిమ్​లో 240 కిలోల బరువులెత్తిన తాప్సీ

ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోర సాధన చేసింది. అంతేకాదు ఆమె ప్రత్యేకంగా దుబాయ్‌లో శిక్షణ కూడా తీసుకుంది.

ఇటీవల మహిళా ప్రధాన్యమున్న కథలు ఎంచుకొంటూ వస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. భారత క్రికెటర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ 'శభాష్ మిథు' (Shabaash Mithu) లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనుంది. అది చిత్రీకరణ దశలో ఉంది. కాగా మరికొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తాప్సీ (Taapsee Pannu) నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'రష్మీ రాకెట్‌' (Rashmi Rocket). ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో కొంతకాలంగా కాస్త ఆసక్తి నెలకొంది.

కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్‌ విడుదల కోసం మరికొంత కాలం ఎదురుచూస్తుందా అని చర్చలు సాగాయి. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు పలు ఓటీటీ వేదికలతో చర్చలు కూడా జరుపుతున్నారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

జిమ్​లో 240 కిలోల బరువులెత్తిన తాప్సీ

ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోర సాధన చేసింది. అంతేకాదు ఆమె ప్రత్యేకంగా దుబాయ్‌లో శిక్షణ కూడా తీసుకుంది.

ఇటీవల మహిళా ప్రధాన్యమున్న కథలు ఎంచుకొంటూ వస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. భారత క్రికెటర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ 'శభాష్ మిథు' (Shabaash Mithu) లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనుంది. అది చిత్రీకరణ దశలో ఉంది. కాగా మరికొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.